ఫస్ట్ నైట్ వేధింపులు: శాడిస్ట్ భర్త కేసులో కీలక మలుపు, రెండ్రోజుల్లో తేలే ఛాన్స్
చిత్తూరు: శాడిస్ట్ భర్త రాజేష్ - శైలజ కేసు కీలక మలుపు తిరిగింది. భర్తకు పొటెన్సీ టెస్టుకు జిల్లా కోర్టు మంగళవారం అనుమతించింది. హైదరాబాదులో రాజేష్కు లైంగిక పటుత్వ పరీక్షలు చేసే అవకాశాలు ఉన్నాయి. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఈ పరీక్షలు చేయించనున్నారు.
ఏం తేలుతుందో?: శాడిస్ట్ భర్త రాజేష్కు నేడే అసలు 'పరీక్ష'.. ఆ రిపోర్టు పైనే అంతా!
అతనికి రెండు రోజుల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. నవ వధువు శైలజను తొలి రాత్రి వేధించిన విషయం ఇటీవల సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. శోభనం రోజు రాత్రి శైలజ గదిలోకి వచ్చిన తర్వాత అతను తాను సంసారానికి పనికి రానని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.
ఫస్ట్ నైట్ వేధింపులు: శాడిస్ట్ భర్త రాజేష్కు నపుంసక పరీక్షలు! మగతనం లేదని తేలితే
భార్యకు వేధింపులు
ఆమె ఈ విషయాన్ని అందరికీ చెప్పిందనే కోపంతో అతను శైలజపై తీవ్రంగా దాడి చేసి కొట్టాడు. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ నేపథ్యంలో ఆమె చెప్పిన వాదన నిజమేనా అని తెలుసుకునేందుకు రాజేష్కు పొటెన్షియల్ టెస్ట్ నిర్వహించనున్నారు.
పలువురి పరామర్శ
మొదటి రాత్రే భార్యను చిత్రహింసలకు గురి చేసిన రాజేష్ పైన విమర్శలు వెల్లువెత్తాయి. నన్నపనేని రాజకుమారి బాధితురాలిని ఇటీవల పరామర్శించారు. ఆమెకు, ఆమె కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా రాజేష్ పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అతను ఎక్కడా చెప్పలేదు
రాజేష్ తాను నపుంసకుడిని అని ఎక్కడా బహిరంగంగా చెప్పలేదు. కానీ శోభనం రోజు రాత్రి భార్యకు మాత్రం చెప్పాడని శైలజ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సంసారానికి పనికి రానప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నాడని వారు ప్రశ్నిస్తున్నారు.
భార్యకు ఆఫర్ ఇచ్చి
తొలి రాత్రి భార్యను చిత్రహింసలు పెట్టడానికి ముందు అతను ఆమెకు ఓ ఆఫర్ కూడా ఇచ్చినట్లుగా ప్రచారం సాగింది. తాను సంసారానికి పనికి రానని, అయితే నీకు ఇష్టం ఉన్న వారితో సంసారం చేయవచ్చునని, నిన్ను నేను భార్యగా బాగా చూసుకుంటానని చెప్పాడని తెలుస్తోంది.