వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిగ్బంధం: అంబటి రాంబాబు అరెస్ట్, ట్రాఫిక్ జామ్‌

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అరెస్టయ్యారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆ పార్టీ బుధవారం, గురువారం రహదారుల దిగ్బంధానికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా అంబటి రాంబాబు గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలో రోడ్డు పైన రాస్తా రోకో నిర్వహించారు.

ఈ రాస్తారోకోలో భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వెళ్లి పోవాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. ఈ క్రమంలో కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు అంబటి రాంబాబును అరెస్టు చేసి పిడుగురాళ్ల పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళ్లారు.

కాగా, సమైక్యాంధ్రపై కేంద్రానికి, మంత్రుల బృందానికి (జివోఎం)కు కనువిప్పు కలిగించడం కోసమే బుధ, గురు రెండు రోజులు రహదారులను దిగ్బంధిస్తున్నట్లు ఆ పార్టీ నాయకురాలు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డి మంగళవారం విలేకరుల సమావేశంలో చెప్పారు.

ఈ రహదారుల దిగ్బంధంలో ప్రజలు, సమైక్యవాదులు అందరూ భాగస్వాములు కావాలని శోభా కోరారు. ఈ రెండు రోజుల పాటు ప్రజలు తమ ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.

కాగా, సీమాంధ్ర వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు పలుచోట్ల రహదారులను దిగ్బంధిస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో కార్యకర్తలు రహదారులను దిగ్బంధించడంతో బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. కడప జిల్లా మైదుకూరులోని ఎన్‌హెచ్ 18, రాజోలు ఎన్‌హెచ్ 216, హైదరాబాదు - గుంటూరు - నర్సారావుపేటల, నెల్లూరు - తిరుపతి తదితర పలు రహదారులను కార్యకర్తలు దిగ్బంధించారు. దీంతో చాలాచోట్ల ట్రాఫిక్ జాం అయింది.

English summary
YSR Congress Party leader Ambati Rambabu arrested by Guntur district police on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X