చంద్రబాబు పాలనపై విరక్తి వచ్చింది..టీడీపీ అభిమాని ఆవేదన (వీడియో)
ఏపీ రాజకీయాల్లో ఇసుక హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇసుకను ఫ్రీగా అందిస్తామని కూటమి నేతలు ప్రకటించారు. ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో ఇసుకను ఫ్రీగా అందిస్తున్నామని సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించారు. టీడీపీ నేతలు ఈ కార్యక్రమాన్ని పెద్ద పండుగలా నిర్వహించారు. అయితే తర్వాత కానీ అసలు విషయం బోధపడలేదు. ఇసుక ఫ్రీనే కానీ ఆ ఇసుకను లబ్దిదారుడు ఇంటికి తీసుకువెళ్లడానికి ప్రభుత్వానికి డబ్బులు చెల్లించాల్సి వస్తోంది.
దీనిపై వైసీపీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇసుక తమ ప్రభుత్వంలోనే చౌకగా దొరికిందని, ఇప్పుడు ఒక టన్నుకు రూ.1300 రూపాయిలు వసూలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇసుక ఫ్రీ విధానంపై కూటమి నేతలు ఎంత కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ , ఇసుక ఉచితంగా దొరకడం లేదనేది అక్షర సత్యం.

దీనిపై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా ఓ టీడీపీ అభిమాని వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఏపీలో ఇసుక ఫ్రీ అనేది రాష్ట్రంలో ఎక్కడా లేదని, లోకల్ నాయకులు ఇసుకు పేరుతో డబ్బులు దండుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను పక్కా టీడీపీ అభిమాని అని, ఓటు కూడా టీడీపీకే వేశానని అతను చెప్పుకొచ్చాడు. టీడీపీ గెలిచిన తర్వాత స్థానిక నేతలు ఇసుకను అక్రమంగా అమ్ముకుంటున్నారని, పైన ఉన్న నేతలు ఫ్రీగా ఇవ్వమని చెప్పినా, ఇక్కడి నేతలు మాత్రం ఇసుకపై అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించాడు.
చంద్రబాబు హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. చంద్రబాబు సీఎం అయిన దగ్గర నుంచి ఆటో వారి మీద కక్ష్య కట్టారని, సిటీలోకి ఆటోవాళ్లను ఎంటర్ కానివ్వడం లేదని తెలిపారు.20, 30 ఏకరాలు ఉన్న వారికి కూడా ఫించన్లు ఇస్తున్నారని సదరు వ్యక్తి ఆరోపించారు.ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు న్యాయం జరగడం లేదని అతను వాపోయాడు. చంద్రబాబు సీఎం అవ్వగానే రోడ్లు అభివృద్ది చేస్తామని చెప్పారని, కానీ రోడ్లు పరిస్థితి ఇప్పటికీ అలానే ఉండిపోయిందని చెప్పుకొచ్చారు.
TDP Fan Fires On CBN!🔥
— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠 (@YSJ2024) March 31, 2025
నేను పుట్టినప్పటి నుంచి పక్కా టిడిపి అభిమానిని.
చంద్రబాబు పాలనలో ఒక్కడు కూడా సంతోషంగా లేడు.
జగన్ పాలనలో నాకు కూడా చాలా పథకాలు వచ్చాయి. pic.twitter.com/qaTCXk9wXk
జగన ఉచిత పథకాలు ఇవ్వడం సరైంది కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.జగన్ హయంలో నాకు పథకాలు అందాయని టీడీపీ అభిమాని తెలిపారు.అలాగే వైసీపీ నేతలు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారని, వాళ్లు గెలిచినప్పుడు కూడా అలాగే జరిగిందా అంటూ సదరు టీడీపీ అభిమాని వైసీపీ శ్రేణులను ప్రశ్నించారు. మొత్తానికి ఏపీలో పాలన చూసి తనకు విరక్తి వేసిందని సదరు టీడీపీ అభిమాని చెప్పడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications