ఓటుకు నోటు ఎఫెక్ట్?: ఏపీ సచివాలయానికి తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సోమవారం వెళ్లారు. ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సోమవారం వెళ్లారు. ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు సోమవారం నోటీసులు జారీ చేసింది. అంతేగాక, వీలైనంత త్వరగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో సండ్ర వెంకట వీరయ్య ఏపీ సచివాలయానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సచివాలయానికి వచ్చిన ఆయన పలువురు టీడీపీ నేతలతో తాజా పరిణామాలపై చర్చలు జరిపారు.

ఓటుకు నోటు కేసులో సండ్ర వెంకట వీరయ్య ఐదో నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఈ కేసులో బెయిల్పై ఉన్నారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది.
-
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications