కాకినాడ-షిర్డీ ఎక్స్ ప్రెస్ రైలు టైమింగ్స్ పై రైల్వే క్లారిటీ..!
కొత్త ఏడాదిలో రైల్వేశాఖ పలు రైళ్ల రాకపోకల సమయాల్లో భారీ మార్పులు చేసింది. ఈ మేరకు ప్రయాణికుల వాటిని గమనించి ప్రయాణాలకు ప్లాన్ చేసుకోవాలని కోరింది. అయితే మారిన రైళ్ల సమయాల్ని ఇప్పటికీ చాలా మంది ప్రయాణికులు గమనించడం లేదు. ఏళ్ల తరబడి తమకు అలవాటైన సమయాల్లోనే రైళ్లు వస్తాయని స్టేషన్లలో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కాకినాడ పోర్ట్-షిర్డీ సాయి నగర్ రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కే విషయంలో ప్రయాణికులకు ఇబ్బంది ఎదురైంది.
కాకినాడ పోర్ట్-షిర్డీ సాయి నగర్ రత్నాచల్ ఎక్స్ప్రెస్ సమయాల్ని రైల్వే శాఖ తాజాగా మార్చింది. జనవరి 1 నుంచి కాకినాడ పోర్ట్-షిర్డీ సాయి నగర్ రత్నాచల్ ఎక్స్ప్రెస్ ను ఉదయం కాకినాడలో 6 గంటలకు బదులు ఐదు గంటలకే బయలుదేరేలా మార్చింది. అయితే ఇవాళ కూడా 5 గంటలకే రైలు బయలుదేరిపోయింది. కానీ చాలా మంది షిర్డీ వెళ్లాల్సిన ప్రయాణికులు 6 గంటలకు రైలు వస్తుందని స్టేషన్ కు వెళ్లి షాకయ్యారు. దీంతో వెంటనే రైల్వే అధికారులకు ఫిర్యాదులు చేశారు.

దీంతో కాకినాడ పోర్ట్-షిర్డీ సాయి నగర్ రత్నాచల్ ఎక్స్ప్రెస్ ను రాజమండ్రి స్టేషన్ లో చాలా సేపు ఆపేయాల్సి వచ్చింది. కాకినాడలో రైలు మిస్సయిన వారిలో కొంత మంది రాజమండ్రి వరకూ వచ్చి ఈ రైలు ఎక్కారు. దీంతో రైలు ఆలస్యంగా బయలుదేరి వెళ్లింది. ఈ నేపథ్యంలో కాకినాడ పోర్ట్-షిర్డీ సాయి నగర్ రత్నాచల్ ఎక్స్ప్రెస్ ప్రయాణ సమయాలపై దక్షిణ మధ్య రైల్వే స్పష్టత ఇచ్చింది. ఈ రైలు సమయాలు మారిన విషయాన్ని గమనించి ఇకపై ప్రయాణాలకు ప్లాన్ చేసుకోవాలని ప్రయాణికుల్ని కోరుతూ దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే మారిన సమయాల్ని మళ్లీ ప్రకటించింది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications