రిషికొండలో సముద్రం ముందుకు, ఆందోళన: ఖైరతాబాద్కు తాపేశ్వరం భారీ లడ్డూ
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రిషికొండ బీచ్లో సముద్రం ముందుకు వచ్చింది. సముద్రంలో కెరటాలు భారీగా ఎగిసిపడుతున్నాయి. బుధవారం నాడు ఉదయం రుషికొండ బీచ్ సమీపంలో సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చింది.
అలలు 5 నుంచి 8 మీటర్లు ఎత్తునకు ఎగిసిపడ్డాయి. తీర ప్రాంతం భారీగా కోతకు గురి కావడంతో పాటు బీచ్ లోని విద్యుత్ స్తంభాలు సైతం నేలకు ఒరిగాయి.
దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనాల కారణంగానే అలల ఉద్ధృతి అధికంగా ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విశాఖ వాతావరణ శాఖ సూచించింది.

తాపేశ్వరం నుంచి ఖైరతాబాద్, విజయవాడకు భారీ లడ్డూలు
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం సురుచి ఫుడ్స్ ఆధ్వర్యంలో తయారు చేసిన ఆరువేల కిలోల భారీ లడ్డూ ప్రత్యేక వాహనంలో ఖైరతాబాద్కు తరలించారు. అంతకు ముందు సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు లడ్డూకు ప్రత్యేక పూజలు నిర్వహించి క్రేన్తో భారీ లడ్డూను వాహనంలో తరలించారు.
విజయవాడలో నిర్వహించే గణేష్ ఉత్సవాలకు తాపేశ్వరం భక్తాంజనేయ స్వీట్స్ ఆధ్వర్యంలో తయారు చేసిన 6300 కిలోల భారీ లడ్డూను ప్రత్యేక వాహనంలో తరలించారు. ఈ సందర్భంగా భక్తాంజనేయ స్వీట్స్ అధినేత శ్రీనుబాబు లడ్డూకు పూజలు నిర్వహించారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications