రిషికొండలో సముద్రం ముందుకు, ఆందోళన: ఖైరతాబాద్కు తాపేశ్వరం భారీ లడ్డూ
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రిషికొండ బీచ్లో సముద్రం ముందుకు వచ్చింది. సముద్రంలో కెరటాలు భారీగా ఎగిసిపడుతున్నాయి. బుధవారం నాడు ఉదయం రుషికొండ బీచ్ సమీపంలో సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చింది.
అలలు 5 నుంచి 8 మీటర్లు ఎత్తునకు ఎగిసిపడ్డాయి. తీర ప్రాంతం భారీగా కోతకు గురి కావడంతో పాటు బీచ్ లోని విద్యుత్ స్తంభాలు సైతం నేలకు ఒరిగాయి.
దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనాల కారణంగానే అలల ఉద్ధృతి అధికంగా ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విశాఖ వాతావరణ శాఖ సూచించింది.

తాపేశ్వరం నుంచి ఖైరతాబాద్, విజయవాడకు భారీ లడ్డూలు
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం సురుచి ఫుడ్స్ ఆధ్వర్యంలో తయారు చేసిన ఆరువేల కిలోల భారీ లడ్డూ ప్రత్యేక వాహనంలో ఖైరతాబాద్కు తరలించారు. అంతకు ముందు సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు లడ్డూకు ప్రత్యేక పూజలు నిర్వహించి క్రేన్తో భారీ లడ్డూను వాహనంలో తరలించారు.
విజయవాడలో నిర్వహించే గణేష్ ఉత్సవాలకు తాపేశ్వరం భక్తాంజనేయ స్వీట్స్ ఆధ్వర్యంలో తయారు చేసిన 6300 కిలోల భారీ లడ్డూను ప్రత్యేక వాహనంలో తరలించారు. ఈ సందర్భంగా భక్తాంజనేయ స్వీట్స్ అధినేత శ్రీనుబాబు లడ్డూకు పూజలు నిర్వహించారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications