Railway News :సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ రెడీ : ముహూర్తం - రూట్ ఖరారు..!!
తెలుగు రాష్ట్రాల్లో మరో వందేభారత్ పట్టాలెక్కనుంది. ఇందుకు ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడుస్తున్న వందేభారత్ కు ఆదరణ పెరుగుతోంది. దీంతో..తెలుగు రాష్ట్రాల నుంచి మరో మూడు కొత్త వందేభారత్ రైళ్లకు రైల్వే శాఖ అనుమతి ఇచ్చిది. అందులో సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందేభారత్ రైలు ప్రారంభానికి రంగం సిద్దమైంది. దీనికి సంబంధించి రూట్ ను కూడా ఖరారు చేసారు. రైలు నెంబర్..రైలు వేళలు మాత్రం ప్రకటించాల్సి ఉంది. దీని ద్వారా ప్రసిద్ద పుణ్యక్షేత్రం తిరుమలకు వేగంగా చేరుకొనే వెసులుబాటు కలుగుతోంది.
సికింద్రాబాద్ - తిరుపతి మధ్య పలు రైళ్లు ప్రస్తుతం ఉన్నా..రద్దీ ఎక్కువగా ఉంటోంది. దీంతో..ఈ మార్గంలో వందేభారత్ తీసుకురావాలన నిర్ణయించారు. ఏప్రిల్ 8న వందేభారత్ ఈ మార్గంలో ప్రారంభించేందుకు నిర్ణయించారు. దీనికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే శాఖకు సమాచారం ఇచ్చారు. ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఇతర రైళ్లల్లో దాదాపు 12 గంటల సమయం పడుతోంది. వందేభారత్ అందుబాటులోకి రావటం ద్వారా ఆరు నుంచి ఏడు గంటల సమయంలో గమ్య స్థానానికి చేరుకొనే అవకాశం కలుగుతుంది. గంటకు 130 నుంచి 150 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లే విధంగా ట్రాక్ ల పటిష్ఠతను పరిశీలిస్తున్నారు.

వందేభారత్ సికింద్రాబాద్ నుంచి తిరుపతికి కనీస ధర రూ 1150 గా ఉండనుంది. రైలు నెంబర్ పైన ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి రెండు మార్గాల్లో ప్రస్తుతం రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్ - ఖాజీపేట- విజయవాడ- తెనాలి- ఒంగోలు మీదుగా ఒక మార్గంలో వెళ్తున్నాయి. అదే విధంగా బీబీనగరం - నల్గొండ - గుంటూరు- తెనాలి- నెల్లూరు మీదుగా మరో మార్గం లో ప్రయాణాలు సాగుతున్నాయి. ఇప్పుడు వందేభారత్ ను నారాయణాద్రి మార్గంలోనూ గుంటూరు మీదుగా ప్రస్తుతం కొనసాగించాలని నిర్ణయించారు. మూడో మార్గం గుంటూరను టచ్ చేయకుండా శావల్యాపురం మీదుగా ఒంగోలు వెళ్లేలా ఆలోచన చేసారు. అయితే, వందేభారత్ ను ప్రస్తుతానికి గుంటూరు -తెనాలి మార్గంలోనే ఆపరేట్ చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో ట్రాక్ - కోచ్ ల నిర్వహణతో పాటుగా ప్రారంభోత్సవానికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే గుంటూరు, తిరుపతి డివిజన్ రైల్వే అధికారులను అప్రమత్తం చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా మూడు వందేభారత్ రైళ్లను ప్రవేశ పెట్టేందుకు నిర్ణయించారు. అందులో ఇప్పుడు సికింద్రాబాద్ - తిరుపతి రైలుకు లైన్ క్లియర్ అయింది. రానున్న రెండు నెలల కాలంలోనే మరో రెండు వందేభారత్ రైళ్లు తెలుగు రాష్ట్రాలకు దక్కనున్నాయి. అందులో ఒకటి కాచిగూడ నుంచి బెంగుళూరు, అదే విధంగా సికింద్రాబాద్ నుంచి పూణే కు నడపాలని నిర్ణయంచారు. ప్రస్తుతం ఈ రెండు ఐటీ సిటీలకు హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగుతున్నాయి. వందేభారత్ ప్రవేశ పెట్టటం ద్వారా ఏ మేర ఆక్యెపెన్సీ ఉంటుందనే అంశం పైన సర్వే చేసారు. అనకూల ఫలితాలు రావటంతో..త్వరలోనే ఈ రెండు రూట్లలోనూ వందేభారత్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications