రైళ్లు ఆగడంతో ఇక్కట్లు, గన్పార్క్ వద్ద అశోక్ (పిక్చర్స్)
హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల మెరుపు సమ్మె ప్రధానంగా రైల్వే శాఖపై పడింది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి వివిధ స్టేషన్ల వద్ద రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈస్ట్ కోస్ట్ రైల్వేలో వాల్తేరు ప్రధాన రైల్వే డివిజన్. ఈ జంక్షన్ నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు రైళ్ళు ప్రయాణిస్తుంటాయి.
సోమవారం ఉదయం 10 గంటల నుంచి విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో రైల్వే విద్యుత్ లైన్లకు సరఫరా నిలచిపోయింది. భువనేశ్వర్ నుంచి వచ్చే రైళ్లు బరంపురం వరకూ బాగానే నడిచాయి. అక్కడి నుంచి విద్యుత్ సరఫరా లేక పోవడంతో అన్ని రైళ్ళు పలాస వద్ద నిలచిపోయాయి.
హౌరా-త్రివేండ్రం, గౌహతి-బెంగళూరు, హౌరా-చెన్నై, తిరుచునాపల్లి ఎక్స్ప్రెస్, విశాఖ నుంచి బెగంళూరు వెళ్ళే ప్రశాంతి, అక్కడి నుంచి విశాఖ వచ్చే ప్రశాంతి ఎక్స్ప్రెస్లు మార్గ మధ్యంలోనే నిలిచిపోయాయి. చెన్నై-హౌరా మెయిల్ మధ్యాహ్నం 1.20 గంటలకు విశాఖ నుంచి బయల్దేరాల్సి ఉంది. తునిలో కోణార్క్ ఆగిపోయంది.
విశాఖ నుంచి బయల్దేరిన రత్నాచల్ ఎక్స్ప్రెస్ బయల్దేరిన కొద్ది సేపటికే నిలిచిపోయింది. డీజిల్ ఇంజన్ సహాయంతో దీన్ని మళ్లీ వెనక్కు తీసుకువచ్చారు. విశాఖ విమానాశ్రయానికి కూడా విద్యుత్ సమస్య ఎదురైంది. ఉదయం నుంచి విమానాశ్రయానికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సోమవారం జనరేటర్పై నడిపించారు.
గన్ పార్క్ వద్ద అశోక్ బాబు
కాగా విజయనగరంలో గురుద్వారాలపై దాడులను నిరసిస్తూ తెలంగాణ ప్రజాఫ్రంట్ ఉపాధ్యక్షుడు వేదకుమార్ నేతృత్వంలో సిక్కులు గన్పార్క్ వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు సిక్కులకు సంఘీభావం తెలిపారు.

సమైక్యాంధ్ర 1
ఎపిఎన్జీవోల సమ్మెకు తోడు సీమాంధ్ర జిల్లాల విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో పరిస్థితి సంక్షోభం స్థితికి చేరుతోంది. కేంద్ర సర్వీసుల్లో అతి ముఖ్యమైన దక్షిణమధ్య రైల్వేకు సమ్మె సెగ తీవ్రంగా తాకింది.

సమైక్యాంధ్ర 2
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ, సమైక్యాంధ్ర ప్రకటన వచ్చే వరకూ సమ్మెను విరమిచేది లేదంటూ విద్యుత్ ఉద్యోగులు భీష్మించటంతో పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉందని కేంద్రం సైతం గాబరా పడుతోంది.

సమైక్యాంధ్ర 3
విద్యుత్ ఉద్యోగుల మెరుపు సమ్మె ప్రధానంగా రైల్వే శాఖపై పడింది. ఉదయం 10 గంటల నుంచి వివిధ స్టేషన్ల వద్ద రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

సమైక్యాంధ్ర 4
ఈస్ట్ కోస్ట్ రైల్వేలో వాల్తేరు ప్రధాన రైల్వే డివిజన్. ఈ జంక్షన్ నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు రైళ్ళు ప్రయాణిస్తుంటాయి. సోమవారం నిలిచిపోయాయి.

సమైక్యాంధ్ర 5
సోమవారం ఉదయం 10 గంటల నుంచి విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో రైల్వే విద్యుత్ లైన్లకు సరఫరా నిలచిపోయింది. భువనేశ్వర్ నుంచి వచ్చే రైళ్లు బరంపురం వరకూ బాగానే నడిచాయి. అక్కడి నుంచి విద్యుత్ సరఫరా లేక పోవడంతో అన్ని రైళ్ళు పలాస వద్ద నిలచిపోయాయి.

సమైక్యాంధ్ర 6
రాష్ట్ర విభజనకు నిరసనగా సోమవారం ఉదయం నుండి విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె కారణంగా తూర్పుగోదావరి జిల్లాలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.

సమైక్యాంధ్ర 7
సమైక్యాంధ్ర కోసం విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో సోమవారం హైదరాబాదులోని నాంపల్లి రైల్వే స్టేషన్లో నిలిచిపోయిన పలు రైళ్ల దృశ్యం.

సమైక్యాంధ్ర 8
సమైక్యాంధ్ర కోసం విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో సోమవారం హైదరాబాదులోని నాంపల్లి రైల్వే స్టేషన్లో నిలిచిపోయిన పలు రైళ్లు నిలిచిపోయాయి. దీంతో స్టేషన్లో ప్రయాణీకుల ఇక్కట్లు.

సమైక్యాంధ్ర 9
సమైక్యాంధ్ర కోసం విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో సోమవారం హైదరాబాదులోని నాంపల్లి రైల్వే స్టేషన్లో నిలిచిపోయిన పలు రైళ్లు.

గన్పార్క్ వద్ద కొవ్వొత్తులు
తెలంగాణ ప్రజాఫ్రంట్ ఉపాధ్యక్షుడు వేదకుమార్ నేతృత్వంలో సిక్కులు గన్పార్క్ వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు సిక్కులకు సంఘీభావం తెలిపారు.

గన్పార్క్ వద్ద కొవ్వొత్తులు
తెలంగాణ ప్రజాఫ్రంట్ ఉపాధ్యక్షుడు వేదకుమార్ నేతృత్వంలో సిక్కులు గన్పార్క్ వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు సిక్కులకు సంఘీభావం తెలిపారు.గురుద్వారాపై దాడికి తమ ఉద్యోగులకు సంబంధంలేదని అశోక్ బాబు స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అశోక్ బాబును గన్పార్క్లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు రానీయటమేంటని తెలంగాణవాదులు నిలదీశారు.












Click it and Unblock the Notifications