ఏపీలో వెయిటింగ్ ఐపీఎస్ ల మరో ధిక్కారం..! సర్కార్ కు షాక్..
ఏపీలో ఐపీఎస్ అధికారులకూ, ప్రభుత్వానికీ మధ్య సాగుతున్న పోరు మరో మలుపు తిరుగుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో విపక్షాలను టార్గెట్ చేసిన పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు చంద్రబాబు సర్కార్ పోస్టింగ్ లు ఇవ్వకుండా వెయిటింగ్ లో ఉంచింది. అదే సమయంలో వారు బెంగళూరు వెళ్లి జగన్ ను కలిశారన్న ఆరోపణలు రావడంతో రెగ్యులర్ గా డీజీపీగా కార్యాలయానికి వచ్చి హాజరు నమోదు చేసి వెళ్లాలని మెమో ఇచ్చింది. అయితే దీన్నీ సదరు ఐపీఎస్ లు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేసిన ఐపీఎస్ బదిలీల తర్వాత 16 మంది అధికారులకు పోస్టింగ్ లు దక్కలేదు. వీరందరినీ తొలుత అలాగే వదిలేద్దామని భావించిన ప్రభుత్వం.. మధ్యలో జగన్ ను కలిశారన్న వార్తల నేపథ్యంలో రోజూ డీజీపీ ఆఫీసుకు వచ్చి హాజరు నమోదు చేసి సాయంత్రం వరకూ ఉండాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే దీన్ని కూడా కొందరు అధికారులు ధిక్కరిస్తున్నట్లు తెలుస్తోంది. డీజీపీ ఆదేశాలను కూడా వీరు లెక్క చేయని పరిస్ధితి ఉండటంతో ప్రభుత్వానికి వీరిని ఏం చేయాలో మింగుడుపడటం లేదు.

ఇలా డీజీపీ ఆదేశాలను ధిక్కరించి రోజూ ఆఫీసుకు రాని వారిలో సీనియర్ ఐపీఎస్ లు సీతారామాంజనేయులు, పీవీ సునీల్ కుమార్, విశాల్ గున్ని, కేకేఎన్ అన్బురాజన్, తిరుమలేశ్వర్ రెడ్డి, సిద్ధార్ద్ కౌశల్, మేరీ ప్రశాంతి, జీఆర్ రాధిక వంటి వారు ఉన్నట్లు సమాచారం. వీరిలో కొందరు సెలవులు తీసుకుని ఆ తర్వాత వస్తుంటే, మరికొందరు మొత్తంగా డీజీపీ ఆఫీసువైపే చూడటం లేదు. దీంతో వీరి విషయంలో ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోబోతోందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
-
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications