ప్రత్యేక హోదా: బాబు విఫలమన్న శైలజానాథ్, రాజధానిపైనా..
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న చంద్రబాబు.. ఏపికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శించారు.
ఏపికి ప్రత్యేక హోదా కష్టమేనని కేంద్రమంత్రులే వ్యాఖ్యానించడం సిగ్గుచేటని శైలజానాథ్ మండిపడ్డారు. రాయలసీమకు హక్కుగా రావాల్సిన రాజధానిని విజయవాడకు తీసుకెళ్లారని మండిపడ్డారు. అనంతపురానికి మంజూరైన ఎయిమ్స్ను మంగళగిరికి
రాజధాని కోసం అఫిడవిట్లు ఇవ్వొద్దు: జనచైతన్య వేదిక
హైదరాబాద్: బహుళ పంటలు పండే భూములను రైతులు రాజధాని కోసం అఫిడవిట్లు ఇవ్వొద్దని జన చైతన్య వేదిక అధ్యక్షుడు జస్టిస్ లక్ష్మణ రెడ్డి సూచించారు. రైతులు ఆహార భద్రతలను కాపాడాలని ఆయన అన్నారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం భూసేకరణ చట్ట సవరణ చేసి రైతు ప్రయోజనాలను దెబ్బతీసిందని మండిపడ్డారు.
రాజధాని ప్రాంతంలో రైతుల పంటలు, ఆస్తుల ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటువంటి బెదిరింపులకు రైతులు లొంగరని అన్నారు. రాజధాని పరిసర గ్రామాల్లో పంట తగులబడి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని లక్ష్మణ రెడ్డి కోరారు.