బస్టాండ్లో ఒంటరి మహిళను వేధిస్తూ అడ్డంగా దొరికిన ప్రిన్సిపల్
హైదరాబాద్: ఈవ్ టీజింగ్కు పాల్పడుతూ ఓ ప్రిన్సిపల్ షీ బృందానికి చిక్కాడు. గురువారం లక్డీకాపూల్ ప్రయాణ ప్రాంగణం వద్ద ఒంటరిగా ఉన్న మహిళను బైక్ ఎక్కమంటూ ఒత్తిడి చేసిన అతని ఘనకార్యాన్ని పోలీసులు వీడియోలో చిత్రీకరించారు.
నిందితుడి పేరు బాచుపల్లి గాయత్రి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ దాన్ శెట్టి(38). బస్టాండులో బస్సు కోసం ఎదురు చూస్తూ కూర్చున్న ఓ మహిళకు అసభ్యకరంగా సంజ్ఞలు చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు.
బైక్ పైన వచ్చిన అతను తన వాహనం పైన ఎక్కాలని మహిళను వేధిస్తున్న దృశ్యాన్ని షీ బృందం వీడియో తీసింది.
అనంతరం అతడిని అదుపులోకి తీసుకుంది. కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.

మరో ఇద్దరు మైనర్లు చిక్కారు
తార్నాక బస్టాప్, మెహిదీపట్నంలో ఇద్దరు బాలురు, ఇద్దరు యువకులను షీటీంలు అరెస్టు చేశాయి. మౌలాలికి చెందిన ఇద్దరు బాలురు సికింద్రాబాదులోని తార్నాక బస్టాపులో గంటపాటు అటూఇటూ తిరిగారు. వివిధ ఫాఠశాలల నుండి వస్తున్న బాలికలను అసభ్యకరంగా వేధించారు.
ఈ దృశ్యాలను షీ టీంలు రహస్య కెమెరాల్లో బంధించి వారిని అదుపులోకి తీసుకున్నాయి. మలక్ పేటకు చెందిన నోమన్, అప్ఝల్ తమీమ్ మొహియుద్దీన్ ఓ బేకరీలో ఉన్న అమ్మాయిలకు చీటీలపై సెల్ నెంబర్లు రాసి ఇచ్చి ఫోన్ చేయమని వేధిస్తున్నారు. వీరిని షీ టీంలు ఆధారాలతో పట్టుకున్నాయి. వీరందర్నీ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications