కుమారి ఆంటీపై వైసీపీ పోస్టులు.. ఏం రాజకీయం గురూ!!
గత పదేళ్లుగా ఫుట్ పాత్ మీద భోజనం అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న కుమారి ఆంటీ ఇటీవల కాలంలో యూట్యూబ్లో బాగా ఫేమస్ అయ్యారు. తన వంటకాలతో భోజన ప్రియులకు కడుపునిండా భోజనం పెట్టడం మాత్రమే కాకుండా తద్వారా ఊహించని ఆదాయాన్ని సంపాదిస్తున్న కుమారి ఆంటీపై ప్రస్తుతం పొలిటికల్ గేమ్ మొదలైంది.
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఉన్న ఐటీసీ కోహినూర్ పక్కన ఉన్న రోడ్లో మధ్యాహ్నం వేళ ఒక పాక వద్ద స్ట్రీట్ వెండర్ కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ నిర్వహిస్తున్నారు. అయితే అక్కడ భోజనం చేయడం కోసం కింది స్థాయి ఉద్యోగుల నుండి ఉన్నత స్థాయి ఆఫీసర్ల వరకు ప్రతి ఒక్కరు వస్తుంటారు.

కుమారి ఆంటీ గా అందరికీ సుపరిచితురాలైన దాసరి సాయి కుమారి ఫుడ్ బిజినెస్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతుండగా ఆమె సంపాదన, ఆమె అక్కడ వండి తీసుకువచ్చి విక్రయించే తీరు పైన యూట్యూబ్ ఛానల్స్ హల్చల్ చేశాయి. దీంతో కుమారి ఆంటీ తక్కువ సమయంలోనే ఫేమస్ అయ్యారు.
అయితే అదే ఆమెకు ఇబ్బందికి తెచ్చిపెట్టింది. ఆమె వల్ల అక్కడ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని, వెంటనే అక్కడి నుండి తన దుకాణాన్ని తీసివేయాలని ట్రాఫిక్ పోలీసులు హుకుం జారీ చేశారు. అయితే ఇక్కడే ఈ వ్యవహారం రాజకీయంగా మలుపు తిరిగింది. కుమారి ఆంటీ యూట్యూబ్ ఛానల్ వాళ్లతో మాట్లాడిన ఒక వీడియోలో ఊర్లో జగన్ ఇచ్చిన ఇల్లు మాత్రమే ఉందని పేర్కొన్నారు.
ఇక ఆ క్లిప్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి, సామాన్యులే మా స్టార్ క్యాంపెయినర్లు అంటూ ప్రచారం మొదలు పెట్టింది. సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి చెబితే వెటకారం చేసిన పెత్తందారులకు దిమ్మ తిరిగిపోయేలా చేసిన దాసరి సాయికుమారి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది వైసిపి.
మొత్తానికి @ncbn , @PawanKalyan ఇద్దరికీ సీఎం వైయస్ జగన్ గారి పేరు వింటేనే వణుకు పుడుతోంది. అందుకే జగనన్న పాలనలో ఇల్లు వచ్చిందని చెప్పిన చిరు వ్యాపారి కుమారి మీద అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వం ఉండడంతో ఆమె మీద దాడులకు ఈ దత్త తండ్రి కొడుకులు… pic.twitter.com/EcfWmsxHOB
— YSR Congress Party (@YSRCParty) January 30, 2024
ఆమె తనకంటూ ఆస్తి ఉందంటే అది జగనన్న ఇచ్చిన ఇల్లు మాత్రమే అని చెప్పడంతో, మంచి చేస్తే గుర్తింపు ఇలానే ఉంటుందని చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి వైసిపి పోస్ట్ పెట్టింది. ఈ వీడియో కారణంగానే కుమారి ఆంటీని అక్కడి ట్రాఫిక్ పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని మరో పోస్ట్ పెట్టింది వైసిపి.
మొత్తానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరికీ సీఎం వైయస్ జగన్ గారి పేరు వింటేనే వణుకు పుడుతోందని, అందుకే జగనన్న పాలనలో ఇల్లు వచ్చిందని చెప్పిన చిరు వ్యాపారి అయిన సాయి కుమారి మీద అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని పేర్కొంది.
ఇది పేదలకు పెత్తం దారులకు జరుగుతున్న యుద్ధం pic.twitter.com/Yc78jJvJQG
— వై.యస్.ఆర్ కుటుంబం™ (@_Ysrkutumbam) January 30, 2024
తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వం ఉండడంతో ఆమె మీద దాడులకు ఈ దత్త తండ్రి కొడుకులు ఉసిగొల్పారని ట్వీట్ చేసింది. జగనన్న అభిమానిని చూసినా మీకు భయం అని చెప్పడానికి ఈ ఒక్క పరిణామం చాలు అంటూ వైసీపీ తన ట్వీట్ లో పేర్కొంది.
-
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..!












Click it and Unblock the Notifications