జగన్కు షాక్: టిడిపిలో చేరిన కీలక నేత, 'విలువైన నాణం దొరికింది'
కర్నూలు జిల్లాకు చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ధర్మవరం సుబ్బారెడ్డి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
కర్నూలు: కర్నూలు జిల్లాకు చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ధర్మవరం సుబ్బారెడ్డి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఆయన అభిమానులు డోన్లో ర్యాలీ నిర్వహించారు. ఓపెన్ టాప్ వాహనంపై నుంచి డిప్యూటీ సీఎం ప్రజలకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. దాదాపు గంటపాటు ర్యాలీ జరిగింది.
పసుపు జెండాలతో ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా కేఈ మాట్లాడారు. తమ పార్టీకి విలువైన నాణెం దొరికిందన్నారు. తమ కుటుంబంతో స్నేహం చేస్తున్న ధర్మవరం సుబ్బారెడ్డికి, వారి అనుచరులకు అన్ని రకాలుగా అండదండలందిస్తామన్నారు.
వచ్చే ఎన్నికల్లో కేఈ ప్రతాప్ను ఎమ్మెల్యేగా గెలిపించడానికి సిద్ధపడటం శుభపరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం సుబ్బారెడ్డితో పాటు సింగిల్ విండో చైర్మన్, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు పలువురు టిడిపిలో చేరారు.
Comments
ys jagan chandrababu naidu ke krishnamurthy telugudesam kurnool వైయస్ జగన్ చంద్రబాబు నాయుడు కేఈ కృష్ణమూర్తి తెలుగుదేశం కర్నూలు
English summary
Shock to YSR Congress Party chief YS Jaganmohan Reddy. Don leader Subba Reddy join Telugudesam.
Story first published: Friday, May 12, 2017, 13:51 [IST]