Shocking: నామినేషన్ ర్యాలీ వాహనంపై చెప్పులతో కొట్టుకోబోయిన వైసీపీ నేతలు
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నామినేషన్ల చివరి రోజు షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి సంజీవయ్య ముందరే నామినేషన్ వాహనంపై వైసీపీ నేతలు చెప్పులతో కొట్టుకోబోయిన ఘటన చోటు చేసుకుంది. పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం, వర్గ విభేదాలు ఎన్నికల సమయంలో బయటపడడంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసిపి ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది.
చెప్పులతో కొట్టుకోబోయిన వైసీపీ నేతలు
అసలు ఇంతకీ ఈ రోజు ఏం జరిగిందంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సంజీవయ్య మళ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు ర్యాలీగా బయలుదేరిన సమయంలో ఎమ్మెల్యే వాహనం పైన ఉన్న ద్వితీయ స్థాయి నాయకులు గొడవ పడడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒకానొక సమయంలో ఇద్దరు నేతలు చెప్పులతో కొట్టుకునే పరిస్థితి చోటు చేసుకుంది.

ద్వితీయ స్థాయి నేతల మధ్య వివాదం
ఎండీసీసీబీ ఛైర్మెన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి సూళ్లూరుపేట మండల అధ్యక్షుడు శేఖర్ రెడ్డి ల మధ్య ఏర్పడిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఒకానొక సమయంలో చెప్పులతో కొట్టుకునే స్థాయికి చేరింది. ఈ వివాదం అంతా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ముందే జరిగింది. సంజీవయ్య వారి ఇద్దరి మధ్య ఘర్షణ ఆపేందుకు ప్రయత్నించే క్రమంలో పక్కకు తూలి పడబోయారు.
తొడలు కొట్టి సవాల్ చేసుకున్న నేతలు.. పోలీసుల ఎంట్రీ
ఇంతటితో ఆగని సత్యనారాయణ రెడ్డి, శేఖర్ రెడ్డిపై దూషణలకు దిగండంతో సహనం కోల్పోయిన శేఖర్ రెడ్డి తొడలు కొట్టి సత్యనారాయణ రెడ్డికి సవాల్ విసిరారు. ఇద్దరూ కొట్టుకునేందుకు సిద్ధం కాగా, సూళ్లూరుపేట సిఐ మధుబాబు ప్రచార వాహనం పై ఎక్కి శేఖర్ రెడ్డిని కిందకు దించేయడంతో పరిస్థితి తాత్కాలికంగా సద్దుమణిగింది.
Shocking: నామినేషన్ ర్యాలీ వాహనంపై చెప్పులతో కొట్టుకోబోయిన వైసీపీ నేతలు..!#YSRCP #AndhraPradesh #Nominations #Elections2024 #APAssemblyElections2024 #Oneindiatelugu pic.twitter.com/GNbfxI4rzP
— oneindiatelugu (@oneindiatelugu) April 25, 2024
ఇలా అయితే కష్టమే
ఈ సమయంలో ఎమ్మెల్యే సంజీవయ్య సత్యనారాయణ రెడ్డి గడ్డం పట్టుకుని బుజ్జగించడం, శేఖర్ రెడ్డి ని వెళ్ళిపోవద్దు ప్రచార రథం పైకి రావాలని బ్రతిమిలాడడం చోటు చేసుకుంది. ఇక ఇరువురు నేతల మధ్య ఘర్షణ నేపథ్యంలో వైసీపీ నేతలు ఇలాగే ఉంటే రాబోయే ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఈ ఘటనపై స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు.
-
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications