రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా : జగన్
Recommended Video
రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్నినిలబెట్టుకుంటానంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలిపారు. ఈమేరకు ప్రజలకు కృతజ్ఝతలు తెలిపారు."వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిన అశేష ప్రజానికానికి.. పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని చాటి చెప్పిన యావత్ రాష్ట్ర ప్రజలకు ... హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను' అని ఫేస్బుక్పేజీలో పోస్ట్ చేశారు.
వైసీపీకి పూర్తి మెజారీటి రావడంతో ఆపార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్దమవుతుంది. ఇందుకోసం వైఎస్ఆర్ పార్టీ శాసన సభా పక్షం శనివారం జరగనుంది. ఈసమావేశంలో పార్టీ శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకోనున్నారు. సాధరణంగా శాసనసభ పక్ష నాయకుడే సభా నాయకుడిగా అంటే ముఖ్యమంత్రిగా ఎన్నుకోనున్నారు. మరోవైపు జగన్ పలువురు ఫోన్ చేసి అభినందనలు తెలుపుతున్నారు. ఈనేపథ్యంలోనే విశాఖ శారదా పీఠాధిపతి స్వామీ స్వరూపానంద సరస్వతికి జగన్ ఫోన్ చేసి ఆశీస్సులు తీసుకున్నారు.