స్టాక్ అదిరింది... రూ.లక్షకు రూ.4 లక్షలు
ఈక్విటీ మార్కెట్లు అంటేనే ఒడిదుడుకుల్లో ప్రయాణం సాగుతుంటుంది. రిస్క్ తీసుకొని పెట్టుబడి పెట్టివారిలో కొందరికి అతి తక్కువ కాలంలోనే అదృష్టం కలిసి వ స్తుంది. మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అందుకుంటారు. అలాంటి ఓ ఎఫ్ఎంసీజీ కంపెనీ స్టాక్ పెట్టుబడిదారులను సంవత్సరం వ్యవధిలోనే మిలియనీర్లను చేసింది. అదే ఎస్కేఎం ఎగ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ ఇండియా లిమిటెడ్ (SKM Egg Products Export India Limited).
ఈ కంపెనీ షేరు గత సంవత్సర కాలంలోనే మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది. సెప్టెంబర్ 28, 2022న ఈ షేరు రూ. 103.20 వద్ద ఉంది. తాజాగా అది సెప్టెంబర్ 28, 2023 రోజున రూ. 449.25కి చేరింది. అంటే సంవత్సర కాలంలోనే పెట్టుబడిదారులకు 300 శాతం రిటర్న్స్ అందించింది. దీని ప్రకారం ఏడాది క్రితం ఇందులో రూ. 1 లక్ష పెట్టి షేర్లు కొన్న వారికి వాటి విలువ ఇప్పుడు రూ. 4 లక్షలు అవుతుంది. సంవత్సరం క్రితం రూ. 5 లక్షలు పెడితే ఇప్పుడు రూ. 20 లక్షలు అవుతోంది.

2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎస్కేఎం ఎగ్ ప్రొడక్ట్స్ కంపెనీ మంచి ఫలితాలు ప్రకటించింది. కంపెనీ నెట్ ప్రాఫిట్ 415.5 శాతం పెరిగి రూ. 35.26 కోట్లైంది. అలాగే కంపెనీ నెట్ సేల్స్ 58.14 శాతం పెరిగి రూ. 210.23 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా ఈ కంపెనీ ఎగ్ పౌండర్, లిక్విడ్ ఎగ్స్, ఫుడ్ ఇండస్ట్రీ, హెల్త్ సెక్టార్లో ఉపయోగించే ఉత్పత్తును తయారు చేయడం, విక్రయించడం చేస్తుంది. ఈ కంపెనీ మొత్తం నిర్మాణం, మిషనరీ యూరప్, యూఎస్డీఏ రెగ్యులేషన్తో నడుస్తాయి.
సెప్టెంబర్ 28, 2023 ట్రేడింగ్ చూసుకుంటే SKM కంపెనీ షేరు రూ. 452 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో గరిష్ఠ స్థాయి రూ. 454.90, కనిష్ఠ స్థాయి రూ. 445గా నమోదైంది. ప్రస్తుతం రూ. 448.50 మార్క్ వద్ద ట్రేడవతూ 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 559.40గా ఉంది. అలాగే కనిష్ఠ స్థాయి రూ. 97.10 గా ఉంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications