ఏం జరిగింది: కొడుకు చనిపోయాడు, తల్లిదండ్రులు ఉరేసుకొన్నారు
కొడుకు మరణించడాన్ని తట్టుకోలేక తల్లిదండ్రులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. ఈ ఘటన గుంటూరులో చోటుచేసుకొంది. జ్వరంతోనే కొడుకు స్కూల్ లోనే చనిపోయాడు.
గుంటూరు :అల్లారుముద్దుగా పెంచుకొన్న కొడుకు మరణించడంతో తట్టుకోలేని తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకొన్నారు. ఈ ఘటన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకొంది.
గుంటూరు పట్టణంలోని పట్టాభిపురానికి చెందిన చంద్రశేఖర్ ,నవీన దంపతుల కుమారుడు వంశీ ఓ ప్రైవేట్ స్కూల్ లో చదువుతున్నాడు. అయితే జ్వరంతో వంశీ పాఠశాలలోనే చనిపోయాడు. వంశీ చనిపోయిన తర్వాత ఆలస్యంగా తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.

అయితే ఒక్కగానొక్క కొడుకు మరణించడంతో ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. కొడుకు తమతో గడిపిన ఘటనలను గుర్తు చేసుకొంటూ ఉండిపోయారు. ఈ అనుభూతులు వారిని తీవ్ర మనస్థాపానికి గురి చేశాయి.
ఒక్క కొడుకు కూడ మరణించడంతో ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. తల్లిదంద్రులు ఉరేసుకొని చనిపోయారు. ఈ ఘటన ఆదివారం నాడు చోటుచేసుకొంది. అయితే ఈ విషయం తెలుసుకొన్న స్థానికులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. విధ్యార్థి మరణానికి, తల్లిదండ్రుల ఆత్మహత్యకు పాఠశాల యాజమాన్యమే కారణమని విధ్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications