ఏపీలో మందకృష్ణకు షాక్, కేసీఆర్ కోసమొచ్చిన సుజనకు నిరాశ
హైదరాబాద్: ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చుక్కెదురైంది. తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించి, సీమాంధ్ర ప్రజల మనోభావాలను గాయపరిచిన మందకృష్ణ ఏపీలో అడుగు పెట్టడానికి వీల్లేదని పలువురు కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు.
ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ సంఘటనలో కడప జరిగింది. స్థానిక కార్యకర్తలు మందకృష్ణ మాదిగకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సుజనా చౌదరికి నిరాశ
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కలవడానికి గురువారం సచివాలయానికి వచ్చిన కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ నేత సుజనా చౌదరికి నిరాశ ఎదురైంది. దాంతో సీఎస్ రాజీవ్ శర్మతో మాట్లాడి ఆయన వెనుదిరగవలసి వచ్చింది.
కేసీఆర్కు ఆరోగ్యం బాగాలేదని అధికారులు చెప్పారని, మరోసారి కేసీఆర్తో భేటీ అవుతానని ఆయన చెప్పారు. అయితే కేసీఆర్ సచివాలయానికి రాలేదని అధికారులు ముందే చెప్పకపోవడంతో సుజనా చౌదరి అసహానం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications