సుజానాకు ఊరట : రెండురోజుల్లో విచారించాలని, వేధించొద్దని సీబీఐకి హైకోర్టు స్పష్టీకరణ
హైదరాబాద్ : ఆంధ్రాబ్యాంకు మోసానికి సంబంధించిన కేసులో కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి కాస్త ఊరట కలిగింది. సీబీఐ జారీచేసిన నోటీసులపై తెలంగాణ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.

రెండురోజుల్లో విచారించండి
ఈ నెల 27, 28 తేదీల్లో సుజనా చౌదరిని విచారించాలని స్పష్టంచేసింది. రెండురోజుల్లోనే విచారణ పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని సూచించింది. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య లంచ్ బ్రేక్ ఇవ్వాలని తెలిపింది.
అడ్వకేట్ సమక్షంలో ..
విచారించే సమయంలో సుజనాచౌదరి వెంట న్యాయవాదిని కూడా అనుమతించాలని సీబీఐకి తేల్చిచెప్పింది. ఈ కేసు విచారణ సందర్భంగా వాంగ్మూలం మాత్రమే తీసుకోవాలని స్పష్టంచేసింది. వాంగ్మూలం పేరుతో అరెస్ట్ చేయొద్దని .. శారీరకంగా హింసించవద్దని స్పష్టంచేసింది.












Click it and Unblock the Notifications