పొన్నంపై కరీంనగర్లో సుమోటోగా కేసు నమోదు: డిజిపి
విజయవాడ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ పైన కరీంనగర్లోనే సుమోటోగా కేసు నమోదు చేశామని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డిజిపి) ప్రసాద రావు శుక్రవారం విజయవాడలో చెప్పారు.
కిరణ్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన పొన్నం పైన కేసు నమోదు చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ డిజిపిని కోరారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ... కరీంనగర్లోనే సుమోటోగా కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కాగా, కరీంనగర్కు కిరణ్ వస్తే ఆయన హెలికాప్టర్ను గాల్లోనే పేల్చేస్తామని పొన్నం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఆయన విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలు అదుపులోనే ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం మావోయిస్టు కార్యకలాపాలు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేమన్నారు.
నిర్భయ చట్టం పైన ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు. ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చాక కేసుల సంఖ్య పెరిగిందని తెలిపారు. పెంచిన హోంగార్డుల వేతనాల అమలుపై వారం రోజుల్లో ఆదేశాలు జారీ అవుతాయన్నారు. విద్యార్హతలను బట్టి కానిస్టేబుళ్లకు పదోన్నతులు ఉంటాయని, త్వరలో విధివిధానాలను రూపొందిస్తామన్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications