‘బాబు’ను చించేశా! దమ్ముంటే నాపై దాడి చెయ్: చింతమనేనికి పద్మశ్రీ సవాల్
విజయవాడ: దమ్ము, ధైర్యం ఉంటే తనపై దాడి చేయాలని టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్కి సవాల్ విసిరారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ. ఓ ఆర్టీసీ బస్సుపై ఉన్న సీఎం చంద్రబాబునాయుడి పోస్టర్ను బుధవారం ఆమె చించేశారు.
అనంతరం పద్మశ్రీ మాట్లాడుతూ.. తాను చంద్రబాబు పోస్టర్ను చించేశానని, హనుమాన్ జంక్షన్కి వచ్చి తనపై దాడి చేయాలంటూ చింతమనేనికి సవాల్ విసిరారు. చంద్రబాబు తన పెంపుడు కుక్కలను ప్రజలపై దాడికి వదులుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అధికారమదంతో చింతమనేని దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. దాడి చేసిన చింతమనేనిని వదిలిపెట్టి.. సామాన్య ప్రజలపై కేసులు నమోదు చేస్తారా? అని పోలీసులను పశ్నించారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని సుంకర పద్మశ్రీ అన్నారు.
ఓ బస్సుకు అతికించిన పోస్టర్లో చంద్రబాబు ముఖం చించివేసి ఉండటాన్ని చూసిన చింతమనేని ప్రభాకర్.. ఆ బస్సు డ్రైవర్, కండకర్టర్లను అసభ్య పదజాలంతో దూషించాడు. అంతేగాక, వారించేందుకు వచ్చిన ఓ వ్యక్తిపై దాడి చేశాడు. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !! -
అమరావతి పై కేంద్రం భారీ శుభవార్త, కొత్త చరిత్ర..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications