వీడియో: ఏబీ వెంకటేశ్వర రావును ఎలా మోసుకెళ్లారో చూస్తారా?
AB Venkateswara Rao: రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు పదవీ విరమణ చేశారు. రిటైర్మెంట్ రోజే ఆయనకు పోస్టింగ్ లభించింది. ఈ ఉదయం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగం డైరెక్టర్ జనరల్గా బాధ్యతలను స్వీకరించారు. సాయంత్రానికి పదవీ విరమణ చేశారు.
1989 బ్యాచ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి.. ఏబీ వెంకటేశ్వరరావు. రాష్ట్ర విభజన సమయంలో ఆయనను ఏపీకి కేటాయించింది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్. 2014- 2019 మధ్యకాలంలో ఏపీలో పలు కీలక విభాగాల్లో పని చేశారు. సుదీర్ఘకాలం ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించారు.

ఆ సమయంలో ఆయన వివాదాలకు కేంద్రబిందువుగా అయ్యారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించిన సమయంలో అప్పటి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనపై విమర్శలు గుప్పించింది. ఆ తరువాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పలుమార్లు సస్పెన్షన్కు గురయ్యారు.
ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారనే కారణంతో ఏపీ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాల్లో ఆయన సెంటర్ అడ్మినిస్ట్రేషన్ ట్రైబ్యునల్ను ఆశ్రయించారు. క్యాట్ సైతం ఏబీవీ సస్పెన్షన్ను సమర్థించడంతో హైకోర్టులో న్యాయపోరాటం చేశారు.
ఎట్టకేలకు ఆయన సస్పెన్షన్ను తొలగిస్తూ తీర్పు ఇచ్చింది హైకోర్టు. పదవీ విరమణకు ఒక్కరోజు ముందు పోస్టింగ్ లభించింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డైరెక్టర్ జనరల్గా ఆయనను అపాయింట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి.
ఏబీ వెంకటేశ్వర రావును ఎలా మోసుకెళ్లారో చూస్తారా?#ABVenkateswaraRao #AndhraPradesh #ViralVideo #Oneindiatelugu pic.twitter.com/eM8qgLTYIc
— oneindiatelugu (@oneindiatelugu) May 31, 2024
ఈ ఉదయం ఆయన బాధ్యతలను స్వీకరించారు. సాయంత్రం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా మద్దతుదారులు ఏబీ వెంకటేశ్వరరావును సన్మానించారు. కార్యాలయంలోని ఆయన ఛాంబర్ నుంచి సన్మాన వేదిక వరకు భుజాలపై మోసుకుంటూ ఊరేగింపుగా తీసుకెళ్లారు.
పూలు చల్లుతూ లాంగ్ లీవ్, లాంగ్ లీవ్.. ఏబీవీ లాంగ్ లీవ్ అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగం ఉద్యోగులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి.. తదితరులు ఏబీవీకి విషెస్ తెలిపారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications