సదావర్తి కేసులో మరో ట్విస్ట్, ఆళ్లకు ఝలక్: కళ్లు మూసుకోలేమని సుప్రీం ఆగ్రహం
సదావర్తి భూముల వ్యవహారంలో మరో ట్విస్ట్. ఈ భూములను మరోసారి వేలం వేయాలని సుప్రీం కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది.
న్యూఢిల్లీ/అమరావతి: సదావర్తి భూముల వ్యవహారంలో మరో ట్విస్ట్. ఈ భూములను మరోసారి వేలం వేయాలని సుప్రీం కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది.
ఈ నెల 14న భూములను వేలం వేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ భూములను తక్కువ ధరకే అప్పనంగా సొంతం చేసుకున్నారన్న అనుమానం తమకు ఉందని కీలక వ్యాఖ్యలు చేసింది.

కళ్లు మూసుకొని కూర్చోలేం
మోసం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కళ్లు మూసుకొని కూర్చోలేమని పేర్కొంది. అంతేకాదు, వేలంలో పిటిషనర్ కూడా పాల్గొనాలని తెలిపింది.

సంజీవరెడ్డి పిటిషన్
ఈ భూముల వేలం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని సంజీవ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ వేయగా, విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు వెలువరించింది.

చౌకగా కొట్టేసేందుకు ప్రయత్నం
తొలుత రూ.22 కోట్లకు అప్పనంగా, ఆపై వైసిపి నేత ఆళ్ల రామకృష్ణా రెడ్డి మరో రూ. 5 కోట్లు ఎక్కువ ఇచ్చి ఈ భూములను చౌకగా కొట్టేసేందుకు చూశారని పిటిషనర్ వాదించారు.

వేలంలో కచ్చితంగా పాల్గొనాలి
ఏపీ ప్రభుత్వం చేసిన వాదనను తిరస్కరిస్తూ హైకోర్టు నిర్ణయించిన తేదీల్లోనే వేలం నిర్వహించాలని తీర్పిచ్చింది. ప్రతివాది, పిటిషనర్ ఆళ్ల వేలంలో కచ్చితంగా పాల్గొనాలని ఆదేశించింది. వేలంలో పాల్గొనకుంటే ఇప్పటికే కట్టిన రూ.10 కోట్లు జఫ్తు చేస్తామని తెలిపింది. హైకోర్టు కంటే తక్కువ ధర కోట్ చేస్తే రూ.15 కోట్లు ఫైన్ ఉంటుందని చెప్పింది.

సదావర్తి భూములు
కాగా, తమిళనాడులోని చంగల్పట్టు వద్ద సర్వే నంబర్ 59/1లో ఎన్నో దశాబ్దాలుగా సేవలందిస్తున్న సదావర్తి సత్రానికి చెందిన భూములున్న విషయం తెలిసిందే.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications