కోడి పందేల కేసు: 12కు వాయిదా వేసిన సుప్రీం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో కోడి పందేలా వివాదానికి సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు 12వ తేదీకి వాయిదా వేసింది. జాతీయ వన్య ప్రాణుల సంరక్షణ బోర్డు, పీపుల్ ఫర్ యానిమల్ను కోడి పందేల కేసులో ప్రతివాదులుగా చేయాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది. కేంద్ర ప్రభుత్వ విజప్తిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు సవరించిన పిటిషన్ను దాఖలు చేయాలని ఆదేశించింది.
కోడి పందేల నిర్వహణకు తాము పూర్తిగా వ్యతిరేకమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. పీపుల్ ఫర్ యానిమల్ గౌరీ మూలే తమ తరపున ఒక పిటిషన్ దాఖలు చేస్తారని తెలిపింది. కోడి పందేల నిర్వహణపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బిజెపి నేత రఘురామకృష్ణరాజు మరికొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

కోడి పందాల నిర్వహణకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంత వరకు జారీ చేసిన ఆదేశాలను తమ పరిశీలనకు పంపించాలని సుప్రీం కోర్టు సూచించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు అందవలసి ఉండటంతోపాటు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు జాతీయ వన్యప్రాణి సంరక్షణ బోర్డును ప్రతివాదులుగా చేర్చిన సుప్రీం కోర్టు.. తాజాగా సవరించిన పిటిషన్ దాఖలు చేసేందుకు వీలుగా కోడి పందేల కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కాగా, 2014లోనే కోడి పందాలను కోర్టు నిషేధించింది, కాబట్టి ఈ కోసులో తమను కూడా చేర్చాలని జాతీయ వన్యప్రాణి రక్షణ కార్యదర్శి అంజలి శర్మ విజప్తి చేశారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications