ముద్రగడతో పిఠాపురం వర్మ భేటీ- లోగుట్టు అదే
SVSN Varma: కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ మరోసారి తెర మీదికి వచ్చారు. ఆయన వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో నియోజకవర్గం పరిధిలో ఇసుక అక్రమ తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారాయన. ఇక్కడ చోటు చేసుకుంటోన్న పరిణామాలు టీడీపీ కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరును తెస్తున్నాయంటూ అసహనం తెలిపారు.
ఈ క్రమంలోనే ఆయనకు వ్యక్తిగత భద్రత కోసం ఇద్దరు గన్మెన్లను కేటాయించిందని ప్రచారం జిల్లా రాజకీయాల్లో ముమ్మరంగా ఉంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోసం తాను గెలిచి తీరే పిఠాపురం నియోజకవర్గాన్ని త్యాగం చేయడం, ఆయన విజయానికి అన్ని రకాలుగా అహర్నిశలు కృషి చేసినప్పటికీ.. ప్రభుత్వం నుంచి తగిన గుర్తింపు లభించలేదని వర్మ అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారనేది బహిరంగ రహస్యమే.

దీంతో ఆయనకు కీలక పదవిని ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారని జిల్లా నాయకులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే వర్మకు గన్ మెన్లను కేటాయించారనీ ఉదహరిస్తోన్నారు. ఈ ప్రచారాన్ని ఎవరూ గానీ ఖండించకపోవడం, తోసిపుచ్చకపోవడంతో ఈ అనుమానాలకు మరింత బలాన్ని ఇస్తోన్నాయి.
ఈ పరిణామాల మధ్య తాజాగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంతో సమావేశం అయ్యారు. ఆయన నివాసంలో ఈ భేటీ ఏర్పాటైంది. అనారోగ్యం నుంచి కోలుకున్న కారణంగా ఎస్వీఎస్ఎన్ వర్మ.. మర్యాదపూరకంగా కలుసుకున్నారు. ఆరోగ్యం, యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కొద్దిరోజుల కిందట ముద్రగడ తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఇందులో నుంచి ఆయన పూర్తిగా కోలుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటోన్నారు. పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు ఆయనను పరామర్శించారు. పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, చిర్ల జగ్గిరెడ్డి, ఆకుల వీర్రాజు, చంద్రశేఖరరెడ్డి, తోట నరసింహం, వంగా గీత, చలమలశెట్టి సునీల్, తోట త్రిమూర్తులు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జక్కంపూడి రామ్మోహన్ కుటుంబ సభ్యులు తనను ఎప్పటికప్పుడు పరామర్శించారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, యనమల కృష్ణుడు గారు, అంగూరి లక్ష్మీశివ కుమారి, జ్యోతుల నెహ్రూ, దౌవులూరి దొరబాబు వంటి నాయకులు పార్టీలకు అతీతంగా ముద్రగడ కుటుంబానికి అండగా నిలిచారు. వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా ఆయనను కలిసి, పరామర్శించారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications