మోడీపై పరిపూర్ణానంద: ‘మూడో నేత్రం’ రిలీజ్(పిక్చర్స్)
హైదరాబాద్: బలమైన కుటుంబ నేపథ్యం.. ధన బలం లేని నరేంద్ర మోడీ ప్రధాని కావడానికి కారణం ఆయన వినయ విధేయతలేనని స్వామి పరిపూర్ణానంద స్వామి పేర్కొన్నారు. మోడీ దూరదృష్టి గల వ్యక్తి అని, దేశాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయగల నాయకుడని అన్నారు. అయితే ఒక్క నాయకుడివల్లే దేశం మారదని, దేశ ప్రజలందరిలో మార్పు వస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు.
గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, ఆకెళ్ల రాఘవేంద్ర ఫౌండేషన్ల సంయుక్తాధ్వర్యంలో ఆదివారం రాత్రి కింగ్ కోఠిలోని భారతీయ విద్యాభవన్లో పరిపూర్ణానంద స్వామి రచించిన ‘మూడో నేత్రం' పుస్తకావిష్కరణ సభ జరిగింది. పుస్తకాన్ని జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ.. మోడీ రాత్రికి రాత్రి ఏదో చేసేస్తాడు అనుకోవడం కలే అన్నారు. అమితమైన పట్టుదలతోనే ప్రధాని పదవిని మోడీ అధిరోహించారని తెలిపారు.
రాజకీయం, మీడియా, పోలీస్, న్యాయవ్యవస్థ ఈ నాలుగింటిలో అవినీతి జరగకపోతే భారతదేశం ప్రపంచ దేశాలను తలదన్నే విధంగా తయారవుతుందన్నారు. బాధ్యతల నుంచి తప్పించుకునే వాడే అదృష్టం కోసం ఎదురు చూస్తాడని.. నిజమైన సాధకుడు అవగాహన పెంచుకొని ముందుకు సాగుతాడని చెప్పారు. అవగాహన రాహిత్యంతో ప్రజలు మోసపోతున్నారని అన్నారు.
పరిపూర్ణానంద స్వామి
బలమైన కుటుంబ నేపథ్యం.. ధన బలం లేని నరేంద్ర మోడీ ప్రధాని కావడానికి కారణం ఆయన వినయ విధేయతలేనని స్వామి పరిపూర్ణానంద స్వామి పేర్కొన్నారు. మోడీ దూరదృష్టి గల వ్యక్తి అని, దేశాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయగల నాయకుడని అన్నారు.
పరిపూర్ణానంద స్వామి
గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, ఆకెళ్ల రాఘవేంద్ర ఫౌండేషన్ల సంయుక్తాధ్వర్యంలో ఆదివారం రాత్రి కింగ్ కోఠిలోని భారతీయ విద్యాభవన్లో పరిపూర్ణానంద స్వామి రచించిన ‘మూడో నేత్రం' పుస్తకావిష్కరణ సభ జరిగింది.
పరిపూర్ణానంద స్వామి
ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ.. మోడీ రాత్రికి రాత్రి ఏదో చేసేస్తాడు అనుకోవడం కలే అన్నారు. అమితమైన పట్టుదలతోనే ప్రధాని పదవిని మోడీ అధిరోహించారని తెలిపారు.
పరిపూర్ణానంద స్వామి
రాజకీయం, మీడియా, పోలీస్, న్యాయవ్యవస్థ ఈ నాలుగింటిలో అవినీతి జరగకపోతే భారతదేశం ప్రపంచ దేశాలను తలదన్నే విధంగా తయారవుతుందన్నారు.