పవన్ కళ్యాణ్ టు నాగబాబు..: మరో ఛాన్స్ లేదు.. చిరంజీవిని లాగుతున్నారు!
చిరంజీవికి కౌంటర్ ఇవ్వాలంటే ప్రత్యర్థి పార్టీలు లేదా ప్రత్యర్థులు ప్రజారాజ్యం పార్టీని తీసుకు వస్తున్నారు.
విజయవాడ: చిరంజీవి విషయంలో ఎప్పుడు ఏ చర్చ జరిగినా 'ప్రజా రాజ్యం' పార్టీ తెరపైకి వస్తోంది. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించారు. 2009 ఎన్నికల్లో పోటీ చేసి, 18 అసెంబ్లీ స్థానాలు గెలిచారు. రెండేళ్లకే ఆయన తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.
ఏ విధంగా చిరంజీవికి కౌంటర్ ఇవ్వాలన్నా ప్రత్యర్థి పార్టీలు లేదా ప్రత్యర్థులు ప్రజారాజ్యం పార్టీని తీసుకు వస్తున్నారు.
ఇటీవల కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలనే ముద్రగడ పద్మనాభంకు మద్దతు పలుకుతున్నారు. దీంతో చిరంజీవని కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కాపులకు ఏం చేశాడని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే, ప్రధానంగా ఇతర విషయాలు వచ్చినప్పుడు ప్రజారాజ్యం పార్టీ పేరు చర్చకు వస్తోంది.
తాజాగా, ఖైదీ నెంబర్ 150 ఫ్రీలాంచ్ వేడుకలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన పరోక్షంగా రామ్ గోపాల్ వర్మను, యండమూరి వీరేంద్రనాథ్ల పైన దుమ్మెత్తి పోశారు.

నాగబాబు వల్ల చిరంజీవి నష్టపోయారు
నాగబాబు వ్యాఖ్యల పైన యండమూరి ఒకింత కూల్ గానే స్పందించారు. రామ్ గోపాల్ వర్మ మాత్రం ఎదురు దాడికి దిగారు. నాగబాబును దుయ్యబట్టారు. అదే సమయంలో ప్రజారాజ్యం పార్టీ ఫెయిల్యూర్కు కూడా నాగబాబును తప్పుబట్టారు. ప్రజారాజ్యం పార్టీ విషయంలో నాగబాబు అన్నయ్యకు తప్పుడు సలహా ఇచ్చారని, ఆ తప్పుడు సలహాతో ఆయన (చిరంజీవి) ఎంత నష్టపోయారో రాష్ట్రానికి మొత్తం తెలుసునని విమర్శించారు.

రాజకీయంగా..
వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కూడా చిరంజీవిని లక్ష్యంగా చేసుకోవాలనుకున్నప్పుడు గతంలో చాలాసార్లు ప్రజారాజ్యం పార్టీనే ప్రస్తావించాయి. పార్టీని నడపలేక చేతులెత్తేసి, కాంగ్రెస్ పార్టీలో కలిపేసారని, అలాంటి చిరంజీవి ఎలా మాట్లాడుతారని మండిపడ్డ సందర్భాలు ఉన్నాయి.

కాపు ఉద్యమం..
ఇటీవల జరుగుతున్న కాపు ఉద్యమానికి చంద్రబాబు మద్దతు పలుకుతున్నారు. ఈ సమయంలో టిడిపి నేతలు చిరంజీవి పైన భగ్గుమన్నారు. పార్టీని నడపలేక కాంగ్రెస్లో కలిపేశారని, ఆయన కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కాపులకు ఏం చేశారని నిలదీశారు.

జనసేన పార్టీ..
పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు, ఆ తర్వాత బీజేపీతో కలుస్తారని, టిడిపితో కలుస్తారని ప్రచారం సాగినప్పుడు కూడా ప్రజారాజ్యం పార్టీ పేరు చర్చకు వచ్చింది. అన్నయ్య చిరంజీవి లాగే పవన్ తన జనసేన పార్టీని ఇతర పార్టీలలో కలుపుతారా? అనే చర్చ సాగింది. జనసేన ఏం చేసినా ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన తెస్తున్నారు.

రోజా
చిరంజీవి వ్యక్తిత్వం గురించి కూడా ఎవరూ కామెంట్ చేయడం లేదు. వ్యక్తిగతంగా ఆయన మంచివాడేనని అంటున్నారు. కానీ పవన్ జనసేన గురించి వచ్చినా, నాగబాబు ఆగ్రహంతో మాట్లాడినా, కాపు అంశం వచ్చినా.. ప్రజారాజ్యం పేరు మాత్రం తీస్తున్నారు. చిరంజీవి లాంటి సున్నిత వ్యక్తి రాజకీయాలకు పనికి రారు అని గతంలో రోజా కూడా వ్యాఖ్యానించారు.
-
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి.. వారు ఏమన్నారంటే? -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!!












Click it and Unblock the Notifications