ఈరోజే!:ఉదయం టీడీపీ సమన్వయ కమిటీ...మధ్యాహ్నం ఎపి మంత్రివర్గ సమావేశం
అమరావతి:బుధవారం టిడిపికి సంబంధించి రెండు కీలక సమావేశాలు జరగనున్నాయి. తొలుత తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం బుధవారం ఉదయం జరగనుంది. అలాగే సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ మంత్రిమండలి సమావేశం జరగనుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించే ఈ కేబినెట్ మీటింగ్ లో ముందుగా ఇటీవల మావోల కాల్పుల్లో ఇటీవల మృతి చెందిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలకు సంతాపం తెలపనున్నారు. అలాగే గత కేబినెట్లో ఆమోదం పొందని విషయాలపై ఇప్పుడు జరిగే సమావేశంలో చర్చించనున్నారని తెలిసింది.

తొలుత ఉదమాన్నే జరిగే టిడిపి సమన్వయ కమిటీ సమావేశంలో తెలుగు దేశం పార్టీకి సంబంధించి అనేక కీలక అంశాలపై చర్చ జరపడంతో పాటు రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా తాజా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రతిపక్షాల నిలువరించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరపనున్నట్లు తెలిసింది.
మధ్యాహ్నం 3 గంటలకు జరిగే కేబినెట్ మీటింగ్ లో ముందుగా మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమాలకు మంత్రిమండలి సంతాపం తెలపనుంది. అనంతరం వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్గ్రేషియా ప్రకటనపై కేబినెట్ ఆమోదం తెలపనుంది.
అనంతరం గత కేబినెట్లో ఆమోదం పొందని పలు అంశాలపై తాజా సమావేశంలో చర్చించి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే గ్రామదర్శిని, పలు అభివృద్ధి పథకాల అమలుపై చర్చతోపాటు, రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై కేబినెట్ లో చర్చించనున్నారు. వీటితో పాటుగా పలు కంపెనీలకు భూకేటాయింపులపై ఎపి కేబినెట్ ఆమోదం తెలపనుందని సమాచారం.
-
ఒరేయ్ ఆజామూ లగెత్తరోయ్.. తులం బంగారం రూ. 2 వేలే.. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు












Click it and Unblock the Notifications