సూపర్ న్యూస్.. సబర్బన్, ఎంఎంటీఎస్ రైల్వే ప్రయాణికులకు మెట్రో రేంజ్ సౌకర్యాలు!

హైదరాబాద్ నగరంలోని ఐటీ కారిడార్ ప్రాంతాల్లో ప్రయాణించే వేలాది మంది ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులకు సూపర్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద హైటెక్‌సిటీ, హఫీజ్‌పేట మరియు మల్కాజిగిరి రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు దాదాపు పూర్తి స్థాయికి చేరుకున్నాయి. ఈ మూడు స్టేషన్లను త్వరలోనే అధికారికంగా ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

మెట్రో తరహాలో ఆ రైల్వేస్టేషన్లు

ప్రస్తుతం హైటెక్‌సిటీ మరియు హఫీజ్‌పేట స్టేషన్లలో 98 శాతం పనులు పూర్తి అయినట్టు తెలుస్తోంది. మల్కాజిగిరి స్టేషన్‌లో 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ మూడు స్టేషన్ల ఆధునీకరణకు మొత్తం రూ.94 కోట్లకు పైగా ఖర్చు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ స్టేషన్లు మెట్రో స్టేషన్ల తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో సిద్ధం కాకున్నాయి.

Super News on Hyderabad mmts railway stations Metro-level amenities for IT corridor railway passengers

హైటెక్‌సిటీ స్టేషన్

ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉపయోగించే హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను పూర్తిగా మార్చేశారు. రోజువారీ సుమారు 6,000 మంది ప్రయాణికులు ఉపయోగించే ఈ స్టేషన్‌లో 12 మీటర్ల వెడల్పు ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఎస్కలేటర్లు, లిఫ్టులు, ఆధునిక టాయిలెట్లు, అదనపు షెల్టర్లు, దివ్యాంగులకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు. ఫేజ్-1 మరియు ఫేజ్-2ల కింద రూ.35.61 కోట్లు ఖర్చు చేశారు.

హఫీజ్‌పేట స్టేషన్

రోజువారీ 10 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ స్టేషన్‌లో కూడా అత్యాధునిక మార్పులు చేశారు. కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఎల్‌ఈడీ లైటింగ్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ప్లాట్‌ఫామ్ షెల్టర్లు, ఆధునిక సైన్ బోర్డులు అందుబాటులోకి వస్తున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ స్టేషన్ ఆధునీకరణపై సంతోషం వ్యక్తం చేశారు.

మల్కాజిగిరి స్టేషన్:

హైదరాబాద్ నగర తూర్పు భాగంలోని ముఖ్యమైన జంక్షన్‌గా ఉన్న ఈ స్టేషన్‌లో 27 జతల ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగుతాయి. రోజుకు సుమారు 3,000 మంది ప్రయాణికులు ఉపయోగించే ఈ స్టేషన్‌లో ఏసీ రెస్ట్ హాల్స్, మెరుగైన పార్కింగ్ సౌకర్యాలు, కొత్త ముఖద్వారం వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి.

ల్యాండ్ క్రూయిజర్ కారు, ముంబైలో ఫ్లాట్, 80లక్షలు క్యాష్.. సర్పంచ్ కు బిగ్ షాక్!
ల్యాండ్ క్రూయిజర్ కారు, ముంబైలో ఫ్లాట్, 80లక్షలు క్యాష్.. సర్పంచ్ కు బిగ్ షాక్!

సబర్బన్ స్టేషన్లలో కూడా పనులు వేగం

ఈ ఆధునీకరణతో పాటు ఉప్పుగూడ, మలక్‌పేట, యాకుత్‌పుర, మేడ్చల్ వంటి ఇతర సబర్బన్ స్టేషన్లలో కూడా పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా లోకల్ రైల్వే స్టేషన్లు మెట్రో స్టేషన్ల స్థాయికి ఎదుగుతున్నాయి. దీంతో ప్రయాణికులు, ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు అవకాశం ఏర్పడుతుంది.ఈ అభివృద్ధి పనులు పూర్తి అయితే హైదరాబాద్ రైల్వే సౌకర్యాలు దేశంలోనే అత్యుత్తమ స్థాయికి చేరుకునే అవకాశం లేకపోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+