ఆంధ్రా పప్పూజీ! జోకర్ ఎవరో అందరికీ తెలుసు: లోకేష్కు ఏపీ బీజేపీ దిమ్మతిరిగే కౌంటర్
అమరావతి: బీజేపీ (భారతీయ జనతా పార్టీ)పై ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు మండిపడ్డారు. బీజేపీని భారతీయ జోకర్స్ పార్టీగా లోకేష్ అభివర్ణించారు. దీనిపై జీవీఎల్ మాట్లాడుతూ.. టీడీపీ అంటే టోటల్ దొంగల పార్టీగా ప్రజలకు తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు.
ఆంధ్రా ప్రజల నోట్లో మట్టికొట్టి జేబులు నింపుకున్న చంద్రబాబు ముందే కదా నిరసన తెలియజేసేందుకు వచ్చిందని చెప్పారు. లక్షల కోట్ల అవినీతి చేసిన ముఖ్యమంత్రిని నిలదీస్తూనే ఉంటామని చెప్పారు.
బీజేపీ అంటే భారతీయ జోకర్స్ పార్టీగా అభివర్ణించిన లోకేష్ పైన ఏపీ బీజేపీ స్పందించింది. ఆంధ్రా పప్పూజీ.. జోకర్ ఎవరో అందరికీ తెలుసులెండి, మీరు పెట్టిన ట్వీట్ నిజంగా మీరు స్వయంగా రాసి, చదవగలరా అని ఎద్దేవా చేసింది.
బీజేపీ అంటే దేశం కోసం, ప్రజల కోసం.. పని చేస్తుందన్నారు. నమ్మి ఓటు వేసిన ప్రజలను జోకర్స్ చేసి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపిన పొలిటికల్ బ్రోకర్స్ మీరు, మీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ గారు అని ఏపీ బీజేపీ మండిపడింది.