సారీ అండి.. ఏమీ అనుకోవద్దు... కొత్తవారికి అవకాశం ఇవ్వాలిగా..??
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం ఒక్కటే తెలుగుదేశం పార్టీ ముందున్న ఆప్షన్. అందుకే ప్రతి అవకాశాన్ని చంద్రబాబు సద్వినియోగం చేసుకోవడంతోపాటు పార్టీ బలహీనతలను, తన బలహీనతలను కూడా అధిగమిస్తూ వస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. తనకు ఎంత క్లోజ్ గా ఉన్నప్పటికీ టికెట్ల దగ్గరకు వచ్చేసరికి గెలుపు గుర్రమైతేనే కేటాయిస్తున్నారు.. లేదంటే నో టికెట్.

అసెంబ్లీతోపాటు లోక్ సభ చాలా ముఖ్యం..
అసెంబ్లీతోపాటు లోక్ సభపై పూర్తిగా దృష్టిపెట్టిన చంద్రబాబు 25 నియోజకవర్గాలకు ఆర్థిక బలం, అంగబలం ఉన్నవారిని ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు. ఏలూరు నుంచి మాగంటి బాబు 2009 ఎన్నికల నుంచి వరుసగా పోటీచేస్తూ వస్తున్నారు.
గెలిచింది మాత్రం 2014లోనే. కాంగ్రెస్ పార్టీనుంచి ఎమ్మెల్యేగా దెందులూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మాగంటి బాబు తెలుగుదేశం పార్టీలో చేరిన 2009 ఎన్నికల్లో కావూరి సాంబశివరావు చేతిలో ఓటమిపాలయ్యారు. 2014లో ప్రస్తుత జనసేన నాయకుడు తోట చంద్రశేఖర్ పై భారీ మెజారిటీతో మాగంటి విజయం సాధించారు. తిరిగి 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లోఆయన ఓటమి తేడా1.65 లక్షలుగా ఉంది.

కుమారుల మరణంతో కుంగిపోయిన బాబు
మాగంటి ఏడాది కాలంలో తన ఇద్దరు కుమారులను కోల్పోయారు. జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్న మాగంటి బాబు పెద్ద కుమారుడు రాంజీ, రెండో కుమారుడు రవీంద్రనాథ్ చౌదరి.. ఇద్దరూ కొద్దినెలల వ్యవధిలోనే కన్ను మూశారు.
మానసికంగా కుంగిపోవడంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తారనుకున్నప్పటికీ కొద్ది నెలలుగా పార్టీ కార్యకర్తలకు, కార్యక్రమాలు నిర్వహిస్తూ నియోజకవర్గ పరిధిలో కలియదిరుగుతున్నారు. నియోజకవర్గ పరిధిలో గ్రూపులు కట్టేవారికి ఆయన హెచ్చరికలు జారీచేస్తున్నారు. అయితే పార్టీ అధినేత చంద్రబాబు మాగంటి విషయంలో మరో ఆలోచన చేస్తున్నారు. ఆయన సేవలను పార్టీకి ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.

కొత్తవారికి అవకాశం ఇద్దామని..
కొత్తనేతలకు అవకాశం ఇద్దామనే యోచనలో ఉన్న చంద్రబాబు ఇటీవల జరిపిన పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన మాజీ మంత్రికి చంద్రబాబు సూచనలు చేశారు. అలాగే ఆయన్ను పిలిపించి చెప్పబోతున్నారు. మాగంటిని దాదాపుగా పక్కన పెట్టినట్లేనని, ఆయన స్థానంలో మాగంటి బాబు సమీప బంధువు కొమ్మారెడ్డి రాంబాబు పేరు ప్రముఖంగా వినపడుతోంది.
ఆయన నాయకత్వంపై అధినేత పూర్తి నమ్మకంతో ఉన్నారు. రాంబాబుతోపాటు మాజీ మంత్రి బోళ్ల బుల్లిరామయ్య మనవడు రాజీవ్ కూడా సీటు ఆశిస్తున్నప్పటికీ 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన యాక్టివ్ గా లేరు. మరోవైపు మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు పేరు కూడా ఏలూరు స్థానానికి వినపడుతోంది.
-
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, మరో పథకం అమలుకు నిర్ణయం..!! -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
లెక్క మారుతోంది, ఇక నుంచి - టార్గెట్ ఫిక్స్ చేసిన చంద్రబాబు..!! -
AP Job Calendar: జాబ్ క్యాలెండర్ పై కీలక అప్డేట్- సర్కార్ డెడ్ లైన్..! రేపే ఖరారు..! -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!!











Click it and Unblock the Notifications