కర్ణాటకలో టీడీపీ ఎంపీ కొడుకు వీరంగం: టోల్గేట్పై దాడి, కంప్యూటర్లు, అద్దాలు ధ్వంసం
కర్ణాటక రాష్ట్రంలోని బాగేపల్లి టోల్ గేట్ వద్ద తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు నిమ్మల కిష్టప్ప కుమారుడు అంబరీష్ వీరంగం సృష్టించాడు.
అమరావతి/కర్ఠాటక: కర్ణాటక రాష్ట్రంలోని బాగేపల్లి టోల్ గేట్ వద్ద తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు నిమ్మల కిష్టప్ప కుమారుడు అంబరీష్ వీరంగం సృష్టించాడు.
బెంగళూరు నుంచి తన స్వగ్రామం గోరంట్లకు వస్తున్న సమయంలో అంబరీష్ బాగేపల్లి టోల్గేట్ వద్దకు చేరుకున్నాడు.

టోల్ రుసుము చెల్లించకుండా తాను ఎంపీ కుమారుడినని సిబ్బందితో చెప్పాడు. ఎంపీలు ప్రయాణించే వాహనాలకు మాత్రమే టోల్ రుసుము మినహాయింపు ఉంటుందని.. ఎంపీ కుమారులకు ఉండదని సిబ్బంది చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు అంబరీష్.
వారితో వాగ్వాదానికి దిగాడు.

అంతేగాక, తన అనుచరులను ఫోన్ చేసి పిలిపించి టోల్ గేట్ పై దాడి చేయించాడు. వారి దాడిలో టోల్ గేట్ క్యాబిన్, కంప్యూటర్లు, అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడి సమాచారం అందుకున్న బాగేపల్లి డీఎస్పీ, పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు.
కాగా, టోల్ గేట్ సిబ్బందిదే తప్పంటూ నిమ్మల కిష్టప్ప కుమారుడు, అతని అనుచరులు చెప్పడం గమనార్హం. కాగా, వీరి వీరంగంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

కన్నడ పోలీస్ సీరియస్
ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారుడు అంబరీష్, అతడి అనుచరులు టోల్ గేట్పై దాడి చేయడాన్ని కర్ణాటక పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. చిక్బళ్లాపూర్ ఎస్పీ కార్తీక్రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి టోల్గేట్ వద్ద జరిగిన పరిణామాలపై ఆరా తీస్తున్నారు. కేవలం రుసుము చెల్లించమని అడిగినందుకు టోల్ సిబ్బందిపై వాగ్వాదానికి దిగడమే కాకుండా.. అనుచరులతో కార్యాలయంపై దాడి చేయడాన్ని సీరియస్గా తీసుకున్నారు. దాడి ఎలా జరిగింది.. ఎవరెవరు పాల్గొన్నారన్న దానిపై ఎస్పీ విచారణ చేపట్టారు. టోల్గేట్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications