పవన్ కళ్యాణ్ 'వ్యాపారం'పై టీడీపీ నేతల ఆగ్రహం, బాబుకు ఫిర్యాదు!
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన తెలుగుదేశం పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మద్దతిచ్చినంత మాత్రాన తీవ్రస్థాయిలో విమర్శలు చేయాలా? అని చర్చించుకుంటున్నారని తెలుస్తోంది.
సోమవారం నాటి ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ టీడీపీ ఎంపీల పేర్లు చెప్పుకుంటూ మరీ విమర్శలు గుప్పించారు. వ్యాపారాల కోసమే అయితే ఎంపీ పదవులకు రాజీనామా చేయాలని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం ఎవ్వరూ మాట్లాడటం లేదని మండిపడ్డారు.

పలువురు టీడీపీ ఎంపీల పేర్లు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలాగే, ఇద్దరు బిజెపి ఎంపీలు గెలిచారని, వారి కూడా మాట్లాడటం లేదని అసహనం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన టీడీపీ ఎంపీలు, నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
పవన్ వ్యాఖ్యలను ధీటుగా తిప్పికొట్టేందుకు తమకు అనుమతివ్వాలని పార్టీ అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును కోరారని తెలుస్తోంది. చంద్రబాబు అనుమతిస్తే విలేకరులతో మాట్లాడుతామని చెప్పారని, అయితే జపాన్ పర్యటనలో ఉన్న చంద్రబాబు మాత్రం తాను వచ్చాక సమీక్షిస్తానని చెప్పారని తెలుస్తోంది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
"సీఎం" ఫోటో చిన్నగా వేస్తారా.. నిప్పులు చెరిగిన పిఠాపురం వర్మ !! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
రేవంత్ సర్కార్ పై హమాలీల సమర శంఖం! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ!












Click it and Unblock the Notifications