టిడిపి ఎప్పుడు ప్రతీకార చర్యలు చేపట్టలేదు...మంచి పద్దతి కాదు:మంత్రి కాల్వ శ్రీనివాసులు
విజయవాడ:పాత్రికేయుడి జీవితం ,రాజకీయ జీవితం పూర్తిగా భిన్నమైనవని రాష్ట్ర పౌరసమాచార శాఖా మంత్రి కాల్వ శ్రీనివాసులు చెప్పారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూపాత్రికేయులందరికి హౌసింగ్ పధకం కింద ఇళ్ల మంజూరు చేయాలన్న నిర్ణయానికి కట్టుబడిఉన్నట్లు తెలిపారు.ఈ వారంలోనే పాత్రికేయుల ఇళ్ల మంజూరుకు సంబంధించి వెబ్ సైట్ ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.విపత్కర పరిస్థితుల్లో ఏర్పడ్డ నవ్యాంధ్ర రాష్ట్రం ఏమవుతుందో అనే ఆందోళన నుండి మనం ఏమైనా చేయగలం అనే నమ్మకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కల్పించారని మంత్రి కాల్వ అన్నారు.

అర్హులందరికీ...పథకాలు
రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రైతు రుణ మాఫీ ,పెన్షన్, రేషన్వంటి పథకాలు అందే విధంగా...వాటన్నింటినీ పారదర్శకంగా అమలు చేస్తున్నామని మంత్రి కాల్వ శ్రీనివాసులు చెప్పారు. అలాగే ఏ వ్యవస్థలోనూ అవినీతి, అక్రమాలు లేకుండా అన్ని వ్యవస్థల్లో పధకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని మంత్రి కాల్వ తెలిపారు. రాష్ట్రం లో వివిధ నీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూ నీటి సమస్యను సమర్ధంగా ఎదుర్కోగలిగామన్నారు.

నమ్మకంతో...పరిశ్రమలు
విభజన అనంతరం ప్రారంభంలో రాష్ట్రంలో పరిశ్రమలు లేవని...అలాంటి పరిస్థితి నుండి పెట్టుబడులకు కేంద్రంగా రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్చి దిద్దారని మంత్రి కాల్వ శ్రీనివాసులు చెప్పారు.కియా వంటి ప్రతిష్టాత్మకమైన పరిశ్రమ రాష్ట్రానికి వస్తుందని తాను అనోకోలేదన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు అవలంబిస్తున్న విధానాలపై నమ్మకంతో ఆ పరిశ్రమలు వచ్చాయన్నారు. మొబైల్ ఫోన్ల తయారీ కేంద్రాలు దేశంలోనే మొదటిసారిగా మనం రాష్ట్రంలో ఏర్పాటు చేశారన్నారు.

ప్రతీకార చర్యలు...చేపట్టలేదు
రాజకీయయంగా టిడిపి ఎప్పుడు ఆకారణంగా విమర్శలు చేయడం గానీ, అబద్ధాలు ఆడటం వంటివి కానీ చేయలేదని మంత్రి కాల్వ అన్నారు.
రాజశేఖర్ రెడ్డి హయాంలో టిడిపి కార్యకర్తలను 54 మందిని హత్య చేశారని...రాష్ట్రంలో అత్యంత భయానక పరిస్థితులు నెలకొల్పారని చెప్పారు. కానీ టిడిపి ఎప్పుడు ప్రతీకార చర్యలు చేపట్టలేదన మంత్రి కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు.

ఆరోపణలు...మంచిది కాదు
టిడిపి ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేవారిని ,ప్రోత్సహించకూడదన్నారు మంత్రి కాల్వ.
పట్టిసీమలో,రాజధాని నిర్మాణంలో ఇష్టం వచ్చినట్లు కోట్లాది రూపాయలు అవినీతి జరిగిందని నిరాధారమైన ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని మంత్రి కాల్వ శ్రీనివాసులు హితవు పలికారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications