టెక్కీ అనూహ్య హత్య కేసు: నిందితుడిని గుర్తించారు!
ముంబై: ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళా టెక్కీ అనూహ్య హత్య కేసు నిందితుడు చంద్రబాన్ను ఇద్దరు సాక్షులు గుర్తించారు. మచిలీపట్నంవాసి, ఉద్యోగరీత్యా ముంబైలో నివాసం ఉంటున్న అనూహ్య గత ఏడాది జనవరిలో దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే.
ఆమెను హత్య చేసినట్టుగా భావిస్తున్న చంద్రబాన్ను అరెస్టు చేసిన పోలీసులు బుధవారం అతడిని టాక్సీ డ్రైవర్ రమేశ్ రాథోడ్కు, బండి పార్కింగ్ స్టాండ్ నిర్వాహకుడు గణేశ్ శెట్టికి చూపారు. వారిద్దరూ అతణ్ని గుర్తించారు.

హత్య జరిగిన రోజు ఉదయం ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి అనూహ్య, చంద్రబాన్ బయటికి వస్తుండగా తాను అతణ్ని టాక్సీ కావాలా అని ప్రశ్నించానని రమేష్ రాథోడ్ వివరించాడు. అప్పుడు అతను తన మోటార్ సైకిల్ను పార్కింగ్లో పెట్టినట్టు తనతో చెప్పాడని రాథోడ్ తెలిపాడు.
కాగా, మచిలీపట్నంకు చెందిన ఎస్తేరు అనూహ్య అదృశ్యమైన అనంతరం పదకొండు రోజుల తర్వాత ముంబైలోని ఓ నిర్జన ప్రదేశంలో విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ఆమె తండ్రి నాడు కేంద్ర హోంమంత్రిని కలిసి కూడా ఫిర్యాదు చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications