ఏపీలో కొత్త ప్రభుత్వానికి రేవంత్ స్నేహహస్తం - తిరుమలలో కీలక వ్యాఖ్యలు..!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి కుటుంబ సమేతంగా వచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ముక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఏపీ-తెలంగాణ సంబంధాలపై మాట్లాడారు. ఫైనల్ గా కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి సానుకూల సంకేతాలు ఇచ్చారు.
తిరుమలలో ఇవాళ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత బయటికి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎంను కలుస్తానని వెల్లడించారు. రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని రేవంత్ తెలిపారు. అలాగే రెండు ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకోవాలన్నారు. తద్వారా కొత్త ప్రభుత్వానికి సానుకూల సంకేతాలు పంపారు. అలాగే తిరుమలలో తెలంగాణ తరపున సత్రం, కళ్యాణమండపం నిర్మిస్తామని కూడా హామీ ఇచ్చారు.

వాస్తవానికి తెలంగాణ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాక రేవంత్ రెడ్డి ఏపీలో వైసీపీ ప్రభుత్వాధినేతగా ఉన్న వైఎస్ జగన్ తో అంటీముట్టనట్టుగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే రేవంత్ ను కలిసారన్న కారణంతో పలువురు వైసీపీ నేతలకు జగన్ టికెట్లు నిరాకరించారు కూడా. దీంతో రేవంత్ - జగన్ మధ్య గ్యాప్ కొనసాగుతోంది. మరోవైపు రేవంత్ మాజీ గురువు చంద్రబాబు ఈసారి రాష్ట్రంలో అధికారంలో వస్తారన్న జోస్యాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
-
అలిపిరితో పాటు తిరుమలలో -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్












Click it and Unblock the Notifications