అన్నా రేవంత్ రెడ్డి ఎవరో తెలిసిందా ?, లోటస్ పాండ్ దెబ్బకు వైసీపీలో ఆ లీడర్స్ సైలెంట్ !
తెలంగాణ ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి అని తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, తెలుగు ప్రజలకు తెలిసిన విషయమే. అయితే రేవంత్ రెడ్డి ఎవరు ?, ఆయనకు మాకు ఏమిటి సంబంధం, ఆయనది ఏ పార్టీ, మాది ఏ పార్టీ, ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తే మేము ఎందుకు శుభాకాంక్షలు చెప్పాలి అంటూ కొంతకాలం నిర్లక్షంగా మాట్లాడిన కొందరు వైసీపీ నాయకులకు ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చుక్కలు చూపించింది.
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని కొందరు వైసీపీ నాయకులు ఇలా మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఎవరండి, పక్క రాష్ట్రంలో సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తే మేము ఎందుకు అక్కడికి వెళ్లాలి, ఇక్కడ మాకు చాలా పనులు ఉన్నాయి, మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాది వైఎస్ఆర్ సీపీ పార్టీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు అంటూ ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాలి నాని తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో ఇలా మాట్లాడారు.

ఇప్పుడు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లోని ఇంటి ముందు అక్రమంగా నిర్మించిన కట్టడాలను జీహెచ్ ఎంసీ అధికారులు తొలగించారు. ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి చూసిచూడనట్లు వ్యవహరించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఆయనకు సీఎం పదవి పోవడంతో ఓసారి సినిమా చూపించాలని అనుకున్నట్లు ఉంది.
హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లోని జగన్ ఇంటి ముందు రోడ్డుకు అడ్డంగా నిర్మించిన పోలీస్ సెక్యూరిటీ చెక్ పోస్టులను జీహెచ్ ఎంసీ అధికారులు నేలమట్టం చేశారు. లోటస్ పాండ్ లో జగన్ ఇంటి ముందు రోడ్డుకు అడ్డంగా కట్టడాలు నిర్మించారని పలువురు ఫిర్యాదులు చేశారని, అక్రమ కట్టడాలు తొలగించాలని లోటస్ పాండ్ సిబ్బందికి నోటీసులు ఇచ్చామని, తరువాత వాటికి కూల్చేశామని జీహెచ్ ఎంసీ అధికారులు అంటున్నారు.

హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ అక్రమంగా నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చివేయడంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరో ? అనే విషయం కొడాలి నానితో పాటు తెలంగాణ సీఎం గురించి మాట్లాడిన వైసీపీ నాయకులకు తెలిసి ఉంటుందని తెలంగాణ ప్రజలు అంటున్నారు. నోరు ఉందికదా అని వెనుకా ముందు ఆలోచించకుండా మాట్లాడిన కొడాలి నానితో పాటు కొందరు వైసీపీ నాయకులు ఇప్పుడు నోరుకూడా మెదపకుండా సైలెంట్ గా ఉండిపోయారని తెలుగు ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
-
హైదరాబాద్ కు మరో మణిహారం..దేశంలోనే రెండో నెట్ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం.. ఎప్పుడంటే! -
"బీరు"తో పాటు బాటిల్ లోపలే స్టఫ్.. బిత్తరపోయిన మందుబాబు !! -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
విజయవాడలో పోలీసులపై గన్ తో కాల్పులు, వరంగల్ వ్యక్తి అరెస్ట్ -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!!












Click it and Unblock the Notifications