వర్మ వ్యూహంలో మరో ట్విస్ట్? హైకోర్టు ముందుకు కీలక పాయింట్! నేడు నిర్ణయం..
ఏపీలో సీఎం వైఎస్ జగన్ పై రూపొందించిన వ్యూహం చిత్రాన్ని వచ్చే ఎన్నికల ముందు ఎలాగైనా విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్న వ్యూహం చిత్ర యూనిట్ ఇప్పుుడ మరో కొత్త పాయింట్ పట్టుకుంది.
గతంలో ఈ చిత్రం విడుదల ఆపాలంటూ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో ఉన్న ఓ లొసుగు ఆధారంగా ఈ పాయింట్ ను తెరపైకి తెచ్చింది. దీన్ని ఆధారంగా చేసుకుని చిత్రం విడుదలకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును కోరింది.

సీఎం జగన్ జీవితంలో కొన్ని కీలక రాజకీయ ఘట్టాల్ని తీసుకుని నిర్మించిన వ్యూహం చిత్రంలో విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ టీడీపీ నేతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికలకు ముందు ఏపీలో వైసీపీకి రాజకీయంగా మేలు చేసే విధంగా ఉద్దేశపూర్వకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్డి ఈ చిత్రం విడుదలపై స్టే ఇచ్చారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వ్యూహం చిత్రం రిలీజ్ కు బ్రేక్ పడింది.
దీనిపై నిర్మాతలు తెలంగాణ హైకోర్టులో డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. ఈ చిత్రానికి జారీ చేసిన సెన్సార్ బోర్డు రివిజన్ కమిటీ యు సర్టిఫికెట్ జారీ చేయడంపై కారణాలు వెల్లడించాలని కోరడం సరికాదని హైకోర్టు డివిజన్ బెంచ్ ముందుకు కొత్త వాదన తెచ్చారు. సెన్సార్ బోర్డు రివిజన్ కమిటీ ఈ చిత్రానికి ఏ, ఏ బై యూ సర్టిఫికెట్ జారీ చేసినప్పుడు మాత్రమే కారణాలు చెప్పాల్సి ఉంటుందని నిర్మాతలు వాదిస్తున్నారు. దీనిపై నిన్న వాదనలు పూర్తి కాకపోవడంతో హైకోర్టు.. ఇవాళ్టికి విచారణ వాయిదా వేసింది. దీనిపై ఇవాళ కూడా వాదనలు విన్నాక హైకోర్టు తుది నిర్ణయం ప్రకటించనుంది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications