వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త వివాదం: 30మంది ఉద్యోగులకు తెలంగాణ షాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో కొత్త వివాదం రాజుకుంది. ఏపీకి స్థానికత కలిగిన ముప్పై మంది వెటర్నరీ ఉద్యోగులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేసింది. మూడు నెలలుగా ఉద్యోగులు జీతాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం.

కొద్ది నెలల క్రితం పదకొండు వందల మందికి పైగా విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది. దీనిపై వారు కోర్టుకు కూడా వెళ్లారు. ఇప్పుడు 30 మంది వెటర్నరీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది.

Telangana veterinary relieve AP native staff

కోర్టుకు వెళ్లవచ్చు: కమలనాథన్ కమిటి

ఉద్యోగుల విభజన, అలాట్‌మెంట్ పైన తెలంగాణ ఉద్యోగ సంఘం నేతలు కమలనాథన్ కమిటీని కలిశారు. వారు తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కమలనాథన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ... ఏవైనా అభ్యంతరాలు ఉంటే కోర్టుకు వెళ్లవచ్చునని సూచించారు. 10 శాఖలు ఈ నెలాఖరులోగా ఉద్యోగుల విభజన పూర్తవుతుందని కమలనాథన్ కమిటీ చెప్పింది.

ప్రతి ఒక్క గిరిజన విద్యార్థికి స్కాలర్ షిప్: రావెల

ఏపీ సచివాలయంలో మంత్రి రావెల కిషోర్ బాబు గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐటీడీఏ పీవోలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గిరిజన విద్యార్థుల స్కాలర్ షిప్‌లు, ఫీజు రీయింబర్సుమెంట్స్ పైన సమీక్ష నిర్వహించారు. ప్రతి ఒక్క గిరిజన విద్యార్థికి స్కాలర్ షిప్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

English summary
Telangana veterinary relieve Andhra Pradesh native staff.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X