తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు విశ్వనాథ్ ఉంటారు..!!
కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణం పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం ప్రకటించారు.
కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణం పట్లు తెలుగు సినీ అభిమానులతో పాటుగా ప్రముఖులు షాక్ అయ్యారు. తన సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమలో లెజెండరీ దర్శకుడుగా విశ్వనాధ్ ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతారని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం ప్రకటించారు. తెలుగు చలనచిత్ర ఆణిముత్యాల్లో ఒకటైన శంకరాభరణం విడుదలైన రోజు (ఫిబ్రవరి 2)నే ఆయన శివైక్యం చెందారు.
గత కొన్ని రోజులుగా వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్న ఆయన.. హెల్త్ ఇష్యూస్ తీవ్రతరం కావడంతో గురువారం రాత్రి హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రి చేరారు. ఆ క్రమంలోనే చికిత్స పొందుతూ గురువారం రాత్రి మనను విడిచి వెళ్లిపోయారు. ఆయన తుదిశ్వాస విడిచిన వార్త తెలిసిన వెంటనే ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.
కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు, తెలుగు సినిమా ప్రేక్షకులకు తీరని లోటని వ్యాఖ్యానించారు. వెండితెరపై దృశ్య కావ్యాలను ఆవిష్కరించిన అరుదైన దర్శకుడని కొనియాడారు. విశ్వనాథ్కు ఆరోగ్యం బాగలేదని తెలిసి గతంలో వెళ్లి పరామర్శించానన్న కేసీఆర్.. సమయంలో సినిమాలు, సంగీతం, సాహిత్యంపై జరిగిన సంభాషణను గుర్తుచేసుకున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ విశ్వనాధ్ మరణం పట్ల సంతాపం ప్రకటించారు. విశ్వనాద్ మరణం తీవ్ర విచారానికి గురి చేసిందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. తెలుగు సంస్కృతికి..భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాధ్ అని సీఎం నివాళి అర్పించారు. విశ్వనాధ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీ రంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయన్నారు. తెలుగు వారి గుండెల్లో కళాతపస్విగా నిలిచిపోతారని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు.
విశ్వనాథ్గారి మరణం తీవ్రవిచారానికి గురిచేసింది. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్గారు. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీరంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయి. తెలుగువారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారు.#KVishwanath pic.twitter.com/XKAq2E68yn
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 2, 2023
విశ్వనాధ్ మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం ప్రకటించారు. ఆయన మరణంతో షాక్ అయినట్లు చెప్పారు. సినీ రంగానికి..వ్యక్తిగతంగా తనకు తీరని నష్టమన్నారు. విశ్వనాధ్ ఒక లెజెండ్ గా చిరంజీవి నివాళి అర్పించారు. విశ్వనాధ్ ప్రతీ జన్మదినం నాడు ప్రత్యేకంగా చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లి గౌరవిస్తారు. ఇప్పుడు విశ్వనాధ్ మరణంతో తనకు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ చిరంజీవి ట్వీట్ చేసారు. విశ్వనాధ్ సినిమాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది.
Shocked beyond words!
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 3, 2023
Shri K Viswanath ‘s loss is an irreplaceable void to Indian / Telugu Cinema and to me personally! Man of numerous iconic, timeless films! The Legend Will Live on! Om Shanti !! 🙏🙏 pic.twitter.com/3JzLrCCs6z
సామాజిక సమస్యలకు ప్రతిబింబాలుగా విశ్వనాధ్ సినిమాలు నిలిచిపోతాయి. కొంత కాలంగా అస్వస్థతో ఉన్న విశ్వనాధ్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆయన సినీ రంగానికి చేసిన సేవలను కొనియాడుతున్నారు.