బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగు మహిళ గెలుపు
బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాకు చెందిన మహిళ విజయం సాధించారు.
ముంబై/చిత్తూరు: బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాకు చెందిన మహిళ విజయం సాధించారు. వివరాల్లోకి వెళితే.. నగరి నియోజకవర్గ పరిధిలోని నిండ్ర మండలం కొత్త ఆరూరు గ్రామానికి చెందిన వినోద్రెడ్డి 30ఏళ్ల క్రితం ముంబై వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.
ఆయన భార్య కండ్రిగ కృష్ణవేణిరెడ్డి ధారవి ప్రాంతంలో సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఆమె సేవలను గుర్తించిన భారతీయ జనతా పార్టీ.. కార్పొరేషన్ ఎన్నికల్లో 174వ డివిజన్లో పోటీ చేసేందుకు టికెట్ ఇచ్చింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేసిన కృష్ణవేణి విజయం సాధించారు.

గురువారం మహారాష్ట్రలో జరిగిన ముంబైతోపాటు 9కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. కాగా, ముంబైలో శివసేనకు 84, బీజేపీకి 82 స్థానాలు దక్కాయి. దీంతో మేజిక్ ఫిగర్ అయిన 114 స్థానాలు ఎవరికీ దక్కలేదు. ఈ క్రమంలో బీజేపీ, శివసేన మళ్లీ పొత్తుపెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications