విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయవాడలో నకిలి మందుల మాఫియా గుట్టురట్టు

|
Google Oneindia TeluguNews

కృష్ణా జిల్లా: విజయవాడలో మరో నకిలీ దందా వెలుగు చూసింది. మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే నకిలీ మందుల మాఫియా గుట్టురట్టయింది. ఈ డూప్లికేట్ మెడిసిన్స్ రాకెట్ కు సంబంధించి 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

వారి వద్ద నుంచి నకిలీ మందుల తయారీకి వినియోగించే యంత్రసామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాఖండ్ కేంద్రంగా ఈ నకిలీ మందుల తయారీ రాకెట్ కొనసాగుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అనేక ప్రముఖ కంపెనీల పేరుతో ఈ డూప్లికేట్ మందులను ఆంధ్రప్రదేశ్ కి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

The fake pharmacy mafia in vijayawada

తమ కంపెనీ పేరుతో నకిలీ మందులు చెలామణి అవుతున్నట్లు జాన్సన్ & జాన్సన్ కంపెనీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారుల తనిఖీలు చేపట్టడంతో ఈ నకిలీ మందుల గుట్టు బైటపడింది. సాయి మెడికల్స్‌లో అల్ట్రా సెట్ నకిలీ మందులను అధికారులు గుర్తించారు. సన్‌ఫార్మా, పాంటాసిట్‌-డిఎస్‌ఆర్, పాంటాసిట్-40 పేరుతో ఈ నకిలీ మందులు పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నట్లు అధికారుల విచారణలో వెల్లడయింది. నకిలీ మందుల తయారీ ముఠాను చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్న పోలీసులను మంత్రి కామినేని శ్రీనివాసరావు అభినందించారు.

English summary
vijayawada: The fake drugs pharma mafia is using the Uttarakhand area as a shelter to transport huge quantities of duplicate medicines to vijayawada, Guntur and other cities. It may be recalled the vijayawada police arrested a 8-member gang and seized machinery.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X