జగన్ అసెంబ్లీకి రానిది అందుకే.. ! అసలు కారణం చెప్పేసిన స్పీకర్..!
అసెంబ్లీ సమావేశాలకు రాకుండా దూరంగా ఉండిపోతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ఇవాళ స్పీకర్ అయ్యన్నపాత్రుడు పరోక్షంగా తీవ్ర విమర్శలకు దిగారు. అనపర్తిలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన స్పీకర్.. జగన్ తీరుపై మండిపడ్డారు. అలాగే ఆయన అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో అసలు కారణం చెప్పేశారు. ఈ కారణం వల్లే జగన్ అసెంబ్లీకి రావడం లేదని అయ్యన్నపాత్రుడు తేల్చిచెప్పేశారు.
అనపర్తి నియోజకవర్గంలోని రామలింగేశ్వర స్వామి గుడిలో జరుగుతున్న పూజలకు హాజరైన స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. అనంతరం వైసీపీ తీరుపై విమర్శలు గుప్పించారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందన్నారు. అప్పట్లో రాక్షస పాలన కొనసాగిందన్నారు. కొంతమంది దుర్మార్గులు, రాజకీయాలకు అర్ధం తెలియని వారు ప్రభువులు అయ్యారంటూ మండిపడ్డారు. గత పాలకుడికి అధికారం తెలుసు తప్ప పాలన తెలియదన్నారు. కాబట్టి మూర్ఖత్వంతో ప్రజల్ని ఇబ్బందులు పెట్టారన్నారు.

అప్పట్లో రాష్ట్ర ఖజానాను దోచుకున్నారంటూ జగన్ పై పరోక్ష విమర్శలు గుప్పించారు. ప్రజలు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని కాపాడారన్నారు. ప్రస్తుతం అనేక ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుంటే వైసీపీ నేతలు వక్రీకరిస్తున్నారని అయ్యన్న ఆరోపించారు. అనంతరం జగన్ అసెంబ్లీకి దూరంగా ఉండిపోవడంపై స్పందించారు. జగన్ కేవలం ఎమ్మెల్యే మాత్రమేనని, కాబట్టి సాధారణ ఎమ్మెల్యేకు ఇచ్చే సమయం మాత్రమే ఆయనకు ఇస్తామన్నారు.

జగన్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని, బయట మీడియా ముందు మాట్లాడటం కాదన్నారు. జగన్ తప్ప మిగతా 10 మంది ఎమ్మెల్యేలు జీతాలు తీసుకొంటున్నారని, కానీ అసెంబ్లీకి రావడం లేదని స్పీకర్ విమర్శించారు. చివరిగా జగన్ అసెంబ్లీకి వచ్చి తన ముందు అధ్యక్షా అని సంబోధిస్తూ మాట్లాడటం ఇష్టం లేకే సభకు రావడం లేదని స్పీకర్ తేల్చేశారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications