ఏపీలో దంచికొడుతున్నఎండలు.. పలు జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు..
ఏపీలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా జనం విలవిల లాడిపోతున్నారు. సోమవారం (ఏప్రిల్ 22) పలుచోట్ల సాధారణంకంటే 3-5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక, నేడు మంగళవారం (ఏప్రిల్ 23) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. మంగళవారం 43 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 104 మండలాల్లో వడగాడ్పులు, బుధవారం 20 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు 100 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశాలు ఉన్నాయన్నారు.
నేడు విజయనగరంలోని 22మండలాల్లో, పార్వతీపురం మన్యం 11 మండల్లాల్లో, శ్రీకాకుళం 9 మండలాల్లోను, అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలంలోను తీవ్ర వడగాడ్పులు ఐఎండీ తెలిపింది. తూర్పు గోదావరిలోని 17మండలాలు, కాకినాడలోని 16 మండలాలు, అనకాపల్లిలోని 15 మండలాలు, శ్రీకాకుళంలోని 11 మండలాలు, అల్లూరి సీతారామరాజులోని 10 మండలాలు, ఏలూరులోని 9 మండలాలు, కోనసీమలోని 7మండలాలు, విజయనగరంలోని 4 మండలాలు, పార్వతీపురం మన్యంలోని 4మండలాలు, విశాఖపట్నంలోని 4 మండలాలు, ఎన్టీఆర్ 3, పల్నాడు 2, గుంటూరు జిల్లాలో ఒక మండలంలోను, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలోను తీవ్ర వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక...
రాష్ట్రంలోని పలు మండలాల్లో తీవ్రవైన వడగాల్పులతో జనం అల్లాడుతుంటే, మరోవైపు ఉత్తర కోస్తాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వీటి వల్ల రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో తీవ్ర ఉక్కపోత, అసౌకర్య వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని, వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు సూచించారు
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications