తిరుమల ఆలయంలోని శ్రీవారి హుండీలో చోరీ.. సీసీటీవీ ఫుటేజీలో దృశ్యాలు..
కళియుగ వైకుంఠ దైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలోని హుండీలో చోరి జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీ వెంకటేశ్వర స్వామి హుండీలోని నగదును ఓ యువకుడు దొంగిలించాడు. ఈ చోరీ దృశ్యాలు ఆలయంలోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దీని ఆధారంగానే ఆలయ భద్రతా సిబ్బంది నిందితుడిని పట్టుకున్నారు.
శ్రీవారి ఆలయంలో నవంబర్ 23వ తేది మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్టీల్ హుండీలో నగదును ఓ యువకుడ దొంగలించే ప్రయత్నం చేశాడు. ఆ నేపథ్యంలో హుండీలోని కొంత నగదును తస్కరించి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ తతంగమంతా హుండీ సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయింది. దీంతో ఈ విషయాన్ని పరిశీలించిన భద్రతా సిబ్బంది ఆ యువకుడిని గుర్తించారు.

రూ. 15వేలు దొంగతనం..
పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆ యువకుడి కోసం భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. అదే రోజు సాయంత్రం 6.00 గంటలకు ఆ యువకుడిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆ యువకుడిని భద్రతా సిబ్బంది కార్యాలయానికి తరలించారు. విచారణ చేపట్టగా, ఈ నేపథ్యంలో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు.
అతడి వద్ద నుంచి 15వేల రూపాయలను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆలయంలో చోరికి గురయిన వ్యక్తిని తమిళనాడుకు చెందిన వేణులింగంగా గుర్తించారు. అతడు శంకరన్ కోవిల్ నివాసి అని వివరించాడు. అనంతరం ఆ యువకుడిని పోలీసులకు టీటీడీ విజిలెన్స్ అధికారులు అప్పగించారు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.












Click it and Unblock the Notifications