కిరణ్ కుమార్ రెడ్డి దూరంగా ఉంటే: రాజకీయాల్లోకి వారసుడు, దూసుకెళ్తున్నాడు
నల్లారి కుటుంబం నుంచి మరో వారసుడు వస్తున్నారు. ఆరు దశాబ్దాల క్రితం రాజకీయాల్లో అడుగుపెట్టిన నల్లారి కుటుంబం ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు పలు పదవులను అధిరోహించింది.
చిత్తూరు: నల్లారి కుటుంబం నుంచి మరో వారసుడు వస్తున్నారు. ఆరు దశాబ్దాల క్రితం రాజకీయాల్లో అడుగుపెట్టిన నల్లారి కుటుంబం ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు పలు పదవులను అధిరోహించింది.

అప్పుడు ప్రారంభం
1962లో నల్లారి కుటుంబం నుంచి నల్లారి అమర్నాథ్ రెడ్డి వాయల్పాడు అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. నాడు పెద్దిరెడ్డి తిమ్మారెడ్డిపై పోటీ చేసి గెలిచిన అమర నాథరెడ్డికి పోటీ చేసేందుకు తగిన వయసు లేదని అనర్హత వేటు వేయడంతో ఉపఎన్నికలు వచ్చాయి.

ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి
నాటి నుంచి ప్రారంభమైన నల్లారి కుటుంబం రాజకీయ ప్రస్థానం ప్రస్తుతం మూడో తరానికి విస్తరించిన ఈ కుటుంబం నుంచి అమర్నాథ్ రెడ్డి తనయుడు కిరణ్ కుమార్ రెడ్డి వాయల్పాడు, పీలేరు అసెంబ్లీ స్థానాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రభుత్వ చీఫ్విప్, శాసనసభాపతితో పాటు ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు.

కిరణ్ రెడ్డి తర్వాత..
అమర్నాథ్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిల తర్వాత.. ఇప్పుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తనయుడు నల్లారి అమర్నాథ్ రెడ్డి రాజకీయ ఆరంగేట్రం చేస్తున్నారు. నల్లారి కుటుంబం తొలుత కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. విభజన వరకు ఆ పార్టీ కాంగ్రెస్లోనే ఉంది.

మూడున్నరేళ్లు రాజకీయాలకు దూరం
విభజన నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. 2014లో పోటీ చేసి ఓడిపోయారు. దీంతో నల్లారి కుటుంబం మూడున్నరేళ్ల పాటు క్రియాశీలక రాజకీయా లకు దూరంగా ఉంది. ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది.

విస్తృతంగా కిషోర్ రెడ్డి పర్యటన, తండ్రి వెంటే తనయుడు
కిషోర్ కుమార్ రెడ్డి ఇటీవల పీలేరు నియోజకవర్గంలో పర్యటిస్తూ ఆత్మీయ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ పర్యటన, సమావేశాలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకోగా, నల్లారి కుటుంబం నుంచి మూడోతరం యువ నాయకుడు నల్లారి అమర్నాథ్ రెడ్డి తన తండ్రి కిషోర్ కుమార్ రెడ్డి వెంట పాల్గొనడం చర్చనీయాంశమైంది.

కిరణ్ రెడ్డి దూరం ఉండే అవకాశం
కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. కాబట్టి ఆయన ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉండవచ్చు. సోదరుడు సంతోష్ కుమార్ రెడ్డి కూడా నియోజకవర్గ రాజకీయాలపై విముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఎండగడుతున్న అమర్నాథ్ రెడ్డి
ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో తనకు తోడుగా ఉండి నియోజకవర్గంలో రాజకీయాలను పర్యవేక్షించేందుకు స్వంత వ్యక్తి అవసరమైన దృష్ట్యా కూడా తనయుడిని కిషోర్ కుమార్ రెడ్డి రాజకీయల్లోకి తీసుకు వచ్చారని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ తండ్రి గెలుపు కోసం ప్రచారంలో పాల్గొన్నారు. ప్రస్తుతం తండ్రి వెంట క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఆత్మీయ సమావేశాల్లో మాట్లాడుతున్నారు. అంతేకాదు, రాజకీయ ప్రత్యర్థుల తీరును ఎండగడుతున్నారు. ఇది యువతను ఆకట్టుకుంటోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications