జనంపైకి దూసుకెళ్లిన బస్సు: ముగ్గురు మృతి (వీడియో)
బుడమేరు వంతెన వద్ద ఓ ఆర్టీసీ బస్సు శుక్రవారం ఉదయం బీభత్సం సృష్టించింది. గవర్నర్పేట డిపోకు చెందిన ఆర్టీసీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సు గన్నవరం వాంబే కాలనీ నుంచి బస్టాండ్ వెళ్తోంది.
విజయవాడ: బుడమేరు వంతెన వద్ద ఓ ఆర్టీసీ బస్సు శుక్రవారం ఉదయం బీభత్సం సృష్టించింది. గవర్నర్పేట డిపోకు చెందిన ఆర్టీసీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సు గన్నవరం వాంబే కాలనీ నుంచి బస్టాండ్ వెళ్తోంది.
బుడమేరు వంతెన వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా బ్రేకులు ఫెయిలై బస్సు జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఓ ఆటో, నాలుగు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి.
మృతులను ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
English summary
Three persons were killed when an Andhra Pradesh State Road Transport Corporation (APSRTC) bus ran amok after its brakes failed at a flyover near Ajit Singh Nagar here on Friday morning. The injured were rushed to a hospital and the condition of two of them is stated to be critical.