శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం.. ముగ్గురు మృతి !!
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా బస్సులు, భారీ వాహనాలతో జరుగుతున్న ప్రమాదాల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతుండటం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. ఈ ఘటనలు ప్రభుత్వ యంత్రాంగం, రహదారి భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం కలకలం రేపింది.
సోంపేట మండలం బారువ జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. లారీ, కారు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ప్రమాద తీవ్రత అంత ఎక్కువగా ఉండటంతో ఘటనాస్థలంలోనే ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం... ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో లారీ అదుపుతప్పింది. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న కారును లారీ ఢీ కొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఢీకొన్న దెబ్బకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికుల సహాయంతో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స పొందుతూ వారు కూడా మృతిచెందారు. దీంతో ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
మృతులు ఒడిశా వాసులుగా గుర్తింపు..
ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురు ఒడిశా రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారు ఏ పనిమీద ప్రయాణిస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అన్న వివరాలపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు వాహనాలను పక్కదారి ద్వారా మళ్లించి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. ప్రమాదానికి గల పూర్తి కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అయితే వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, రహదారి భద్రత లోపాలు ఇలాంటి ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. భారీ వాహనాల నియంత్రణ, జాతీయ రహదారులపై భద్రతా చర్యలు మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications