పోలీసులమంటూ చోరీలు: ఇరానీ గ్యాంగ్ అరెస్ట్(పిక్చర్స్)
హైదరాబాద్: పోలీసులమని నమ్మించి అమాయక ప్రజలను మోసం చేస్తూ చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతరాష్ట్ర ముఠా సభ్యులను సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 10 లక్షల నగదుతోపాటు రెండు బైకులు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ అదనపు డిసిసి కోటిరెడ్డి, సెంట్రల్ జోన్ సిఐ భాస్కర్ శుక్రవారం డిసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
అనంతపురం జిల్లా గుంతకల్లోని గంగానగర్ వాసులైన షబ్బీర్ అలీ అలియాస్ షబ్బీర్ హుస్సేన్ (39), షేక్ హసన్(21), హజ్జు అలీ (20)లు మహారాష్ట్రలోని శాంతినగర్, బీవడిలో స్థిరపడ్డారు. వీరు ముగ్గురూ గత కొంతకాలంగా పోలీసుల అవతారం ఎత్తి ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడ్డారు. విశ్వసనీయ సమాచారం మేరకు సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వీరిని వలపన్ని పట్టుకున్నారు.
పోలీసుల విచారణలో నగరంలోని హుమాయన్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ నుంచి నగలను అపహరించినట్లు నిందితులు అంగీకరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 11 కేసుల్లో వీరిని నిందితులుగా గుర్తించారు పోలీసులు.

ఇరానీ గ్యాంగ్ అరెస్ట్
పోలీసులమని నమ్మించి అమాయక ప్రజలను మోసం చేస్తూ చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతరాష్ట్ర ముఠా సభ్యులను సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

ఇరానీ గ్యాంగ్ అరెస్ట్
నిందితుల నుంచి రూ. 10 లక్షల నగదుతోపాటు రెండు బైకులు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ అదనపు డిసిసి కోటిరెడ్డి, సెంట్రల్ జోన్ సిఐ భాస్కర్ శుక్రవారం డిసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ఇరానీ గ్యాంగ్ అరెస్ట్
అనంతపురం జిల్లా గుంతకల్లోని గంగానగర్ వాసులైన షబ్బీర్ అలీ అలియాస్ షబ్బీర్ హుస్సేన్ (39), షేక్ హసన్(21), హజ్జు అలీ (20)లు మహారాష్ట్రలోని శాంతినగర్, బీవడిలో స్థిరపడ్డారు.

ఇరానీ గ్యాంగ్ అరెస్ట్
వీరు ముగ్గురూ గత కొంతకాలంగా పోలీసుల అవతారం ఎత్తి ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడ్డారు.

ఇరానీ గ్యాంగ్ అరెస్ట్
విశ్వసనీయ సమాచారం మేరకు సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వీరిని వలపన్ని పట్టుకున్నారు.

ఇరానీ గ్యాంగ్ అరెస్ట్
పోలీసుల విచారణలో నగరంలోని హుమాయన్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ నుంచి నగలను అపహరించినట్లు నిందితులు అంగీకరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 11 కేసుల్లో వీరిని నిందితులుగా గుర్తించారు పోలీసులు.












Click it and Unblock the Notifications