మూడు హత్యలు: ఐఎంఈఐ నెంబర్తో దొరికారు
ఫోన్లో కృష్ణమూర్తి సిమ్ తీసివేసి వేరు వేరు సిమ్లతో వాడుతున్నారని తెలుసుకోని పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోని విచారించగా, కామవరపు కోటలో వాసా అంజనేయులు, జంగారెడ్డి గూడెం వడ్డీ వ్యాపారి నున్న వెంకట సుబ్బారావు హత్య కేసుల్లో వీరే నిందులని వెల్లడైందని పోలీసులు తెలిపారు.
ఈ హత్య కేసు వివరాలను జంగారెడ్డి గూడెంలోని తన కార్యాలయంలో ఆదివారం డీఎస్పీ ఏవీ సుబ్బరాజు విలేకరులకు వెల్లడించారు. ఈ హత్యలకు ఎల్ ఐసీ ఏజెంట్, రియల్ ఎస్టేట్ వ్యాపారి దారా నారాయణ రావు ప్రధాన కారకుడని తెలిపారు. నిందితుడు నారాయణరావుని అరెస్టు చేసి, విచారించగా, మూడు హత్యలను చేశానని అంగీకరించాడని అన్నారు. హత్యలు చేయడంలో అతనికి సహకరించిన కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంకు చెందిన గాదె సురేష్, జంగారెడ్డి గూడెంకు చెందిన కొండా బత్తుల బ్రహ్మాజీలను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అధిక వడ్డీలకు డబ్బులు తీసుకోని వాటిని చెల్లించలేక, ఈ హత్యలు చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి సుమారు 50 కాసుల బంగారం, 664 గ్రాముల వెండి, మృతుడు కృష్ణమూర్తికి చెందిన రెండు సెల్ ఫోన్లు, రూ. 1,35,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ఉపయోగించిన సాంత్రో జింగ్ కారు, రెండు బైక్లు, టీవీఎస్ జూపిటర్ మోపెడ్, నాలుగు సెల్ పోన్లును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.